BRS Meeting on Parliament Elections 2024 : కేసీఆర్పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉందని, కాంగ్రెస్కు ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్(KTR) ప్రసంగించారు. జనవరి మూడో తేదీన ఆదిలాబాద్తో ప్రారంభమైన సమావేశాలు ఇవాళ ముగుస్తున్నాయని తెలిపారు. సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని వివరించారు.
-
నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) January 22, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి
నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు… pic.twitter.com/Brk0zNVQDe
">నల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) January 22, 2024
జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి
నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు… pic.twitter.com/Brk0zNVQDeనల్లగొండ లోక్ సభ నియోజక వర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) January 22, 2024
జనవరి 3 ఆదిలాబాద్ తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి
నేటితో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు… pic.twitter.com/Brk0zNVQDe
ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేది : కేటీఆర్
పార్టీకి కార్యకర్తలే కథానాయకులని కేటీఆర్ అన్నారు. వారి వల్లే ఇన్నేళ్లు పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయని కేటీఆర్ తెలిపారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదని, దీనికే కాంగ్రెస్ వాళ్లు ఉలికి పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోమని అన్నారు.