ETV Bharat / politics

గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత - బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అరెస్టు - police arrest brs leaders

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Police Arrest BRS Committee Leaders : సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఆసుపత్రి వద్దకు చేరుకున్న బీఆర్​ఎస్​ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Police Arrest BRS Committee Leaders
Police Arrest BRS Committee Leaders (ETV Bharat)

BRS Leaders Arrest at Gandhi Hospital : రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై బీఆర్​ఎస్​ నియమించిన త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రికి రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్దకు చేరుకున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సంజయ్​, మాగంటి గోపీనాథ్​లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మాజీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్​ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​లతో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై బీఆర్​ఎస్​ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముందుగానే బీఆర్​ఎస్​ నేతలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతను పెంచారు. ఆసుపత్రిలోకి బీఆర్​ఎస్​ నాయకులను రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ముందుగా తెలంగాణ భవన్​కు చేరుకున్న నేతల కమిటీ మాట్లాడుతూ, ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకని అడిగారు. గాంధీ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలను ప్రభుత్వం దాస్తుందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏమైనా బయటపడుతుందని భయపడుతున్నారా అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్​ చేశారు.

అరెస్టు చేయడం దారుణం : మాతాశిశు మరణాలు ఎందుకు పెరిగాయి అనే విషయం అడిగేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ ఆవేదన చెందారు. నిర్మాణాత్మకమైన అంశాలపైనే పోరాడుతున్నామన్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​తో కూర్చుని మాట్లాడాలని వస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్య తెలుసుకోవాలని సీఎం అన్నారని ప్రతిపక్ష బాధ్యతగా అదే పని చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, సీనియర్లు, స్టాఫ్​ కొరత ఉందని తెలిపారు.

కమిటీని ఎందుకు అడ్డుకున్నారు : మరోవైపు బీఆర్​ఎస్​ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీని గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని ధ్వజమెత్తారు. సీఎం, కాంగ్రెస్​ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదని కేటీఆర్​ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ కమిటీ

గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్​పై దాడి - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - Attack On Junior Doctor In Gandhi

BRS Leaders Arrest at Gandhi Hospital : రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై బీఆర్​ఎస్​ నియమించిన త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రికి రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్దకు చేరుకున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సంజయ్​, మాగంటి గోపీనాథ్​లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

మాజీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్​ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​లతో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై బీఆర్​ఎస్​ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముందుగానే బీఆర్​ఎస్​ నేతలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతను పెంచారు. ఆసుపత్రిలోకి బీఆర్​ఎస్​ నాయకులను రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ముందుగా తెలంగాణ భవన్​కు చేరుకున్న నేతల కమిటీ మాట్లాడుతూ, ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకని అడిగారు. గాంధీ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలను ప్రభుత్వం దాస్తుందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏమైనా బయటపడుతుందని భయపడుతున్నారా అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్​ చేశారు.

అరెస్టు చేయడం దారుణం : మాతాశిశు మరణాలు ఎందుకు పెరిగాయి అనే విషయం అడిగేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ ఆవేదన చెందారు. నిర్మాణాత్మకమైన అంశాలపైనే పోరాడుతున్నామన్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్​తో కూర్చుని మాట్లాడాలని వస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్య తెలుసుకోవాలని సీఎం అన్నారని ప్రతిపక్ష బాధ్యతగా అదే పని చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, సీనియర్లు, స్టాఫ్​ కొరత ఉందని తెలిపారు.

కమిటీని ఎందుకు అడ్డుకున్నారు : మరోవైపు బీఆర్​ఎస్​ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీని గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని ధ్వజమెత్తారు. సీఎం, కాంగ్రెస్​ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదని కేటీఆర్​ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు.

గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ కమిటీ

గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్​పై దాడి - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - Attack On Junior Doctor In Gandhi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.