ETV Bharat / politics

'రేవంత్ మీ లక్ వ్యాలిడిటీ ఐదేళ్లు మాత్రమే - కాస్త సీఎంలా ప్రవర్తించండి' - Harish Rao Fires On CM Revanth

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 8:00 PM IST

Updated : Sep 15, 2024, 8:47 PM IST

Harish Rao Fires On CM Revanth Behaviour : సీఎం పదవిలో కూర్చున్న రేవంత్​రెడ్డి హుందాగా మాట్లాడాలని బీఆర్ఎస్ సీనియర్​ నేత, మాజీ మంత్రి​ హరీశ్​రావు హితవు పలికారు. ఇవాళ గాంధీ భవన్​లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై హరీశ్​రావు తీవ్రంగా స్పందించారు. వానాకాలం రైతుభరోసా ఇప్పటివరకు ఇవ్వలేదన్న ఆయన, అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ చేసిందెవరని నిలదీశారు.

Harish Rao Fires On CM Revanth Behaviour
Harish Rao Responds On CM Revanth Comments (ETV Bharat)

Harish Rao Responds On CM Revanth Comments : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రుణమాఫీ అయిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీ జరిగితే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. సిద్దిపేట వెంకటాపురం గ్రామంలో 82మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరాలు పంపిస్తానని మాఫీ చేయాలన్నారు.

రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారని సీఎంను ఉద్దేశించి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్​రావు, సీఎంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటి కేసీఆర్‌ సర్కార్‌ ముందుచూపుతో ఫార్మాసిటీకి సేకరించిన భూమిని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ఫోర్త్‌ సిటీ అంటూ రేవంత్​ కొత్త రాగం ఎత్తుకున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు.

ఐదేళ్లకు మించి కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు : మరోసారి అధికారం తమదే అన్న సీఎం వ్యాఖ్యలపై, దేశంలో ఎక్కడచూసినా కాంగ్రెస్‌ ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉంటుందని మాజీమంత్రి హరీశ్​రావు విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్‌ సర్కార్​ గద్దె దింపేశారని గుర్తు చేశారు. అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్‌రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని వ్యాఖ్యానించారు.

"ఈ అయిదేళ్ల కాలమే మీకు ఎక్కువ. మీ పరిపాలనలో ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. మీ లక్​ బాగుండి మీరు గెలిచారు, ఇప్పుడు ఐదేళ్లు మీరు సీఎంగా ఉంటారు. ఈ వ్యవధిలో మంచిగా పనులు చేయండి. మీకున్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగిస్తే కాస్తయినా మంచిపేరు వస్తుంది. రెండోసారి గెలిస్తా అంటే కాంగ్రెస్​కు అంత సీనులేదు. దేశంలో ఎక్కడైనా మీ పార్టీ ఒక్కసారికే పోతుంది."-హరీశ్‌రావు, బీఆర్​ఎస్​ సీనియర్​ నేత

అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ : రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని హరీశ్​రావు ప్రశ్నించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తి హుందాగా మాట్లాడాలని హరీశ్​రావు హితవు పలికారు. రుణమాఫీ విషయంలో సీఎం ఒకరకంగా, వ్యవసాయశాఖ మంత్రి మరొకరంగా చెబుతున్నారని ధ్వజమెత్తారు.

వానాకాలం రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదన్న ఆయన, అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ చేసిందెవరని నిలదీశారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ప్లాన్‌ సీఎందే తానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో రూఢి అయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పదే పదే తన ఎత్తుపై మాట్లాడటం సరికాదన్న హరీశ్‌రావు, హుందాగా వ్యవహరించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.

ఐటీ పరిశ్రమల భూములను తాకట్టు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? : కేటీఆర్ - KTR on Hyderabad it Lands

మేమూ దాడులు చేయగలం కానీ - తెలంగాణ ఇమేజ్ పాడవ్వొద్దని ఆగుతున్నాం : హరీశ్ రావు - HARISH RAO SLAMS CONGRESS GOVT

Harish Rao Responds On CM Revanth Comments : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రుణమాఫీ అయిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీ జరిగితే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు. సిద్దిపేట వెంకటాపురం గ్రామంలో 82మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరాలు పంపిస్తానని మాఫీ చేయాలన్నారు.

రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారని సీఎంను ఉద్దేశించి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్​రావు, సీఎంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటి కేసీఆర్‌ సర్కార్‌ ముందుచూపుతో ఫార్మాసిటీకి సేకరించిన భూమిని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ఫోర్త్‌ సిటీ అంటూ రేవంత్​ కొత్త రాగం ఎత్తుకున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు.

ఐదేళ్లకు మించి కాంగ్రెస్‌ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు : మరోసారి అధికారం తమదే అన్న సీఎం వ్యాఖ్యలపై, దేశంలో ఎక్కడచూసినా కాంగ్రెస్‌ ఒక్కసారి మాత్రమే అధికారంలో ఉంటుందని మాజీమంత్రి హరీశ్​రావు విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్‌ సర్కార్​ గద్దె దింపేశారని గుర్తు చేశారు. అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్‌రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని వ్యాఖ్యానించారు.

"ఈ అయిదేళ్ల కాలమే మీకు ఎక్కువ. మీ పరిపాలనలో ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. మీ లక్​ బాగుండి మీరు గెలిచారు, ఇప్పుడు ఐదేళ్లు మీరు సీఎంగా ఉంటారు. ఈ వ్యవధిలో మంచిగా పనులు చేయండి. మీకున్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగిస్తే కాస్తయినా మంచిపేరు వస్తుంది. రెండోసారి గెలిస్తా అంటే కాంగ్రెస్​కు అంత సీనులేదు. దేశంలో ఎక్కడైనా మీ పార్టీ ఒక్కసారికే పోతుంది."-హరీశ్‌రావు, బీఆర్​ఎస్​ సీనియర్​ నేత

అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ : రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని హరీశ్​రావు ప్రశ్నించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తి హుందాగా మాట్లాడాలని హరీశ్​రావు హితవు పలికారు. రుణమాఫీ విషయంలో సీఎం ఒకరకంగా, వ్యవసాయశాఖ మంత్రి మరొకరంగా చెబుతున్నారని ధ్వజమెత్తారు.

వానాకాలం రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదన్న ఆయన, అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ చేసిందెవరని నిలదీశారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ప్లాన్‌ సీఎందే తానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో రూఢి అయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పదే పదే తన ఎత్తుపై మాట్లాడటం సరికాదన్న హరీశ్‌రావు, హుందాగా వ్యవహరించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.

ఐటీ పరిశ్రమల భూములను తాకట్టు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? : కేటీఆర్ - KTR on Hyderabad it Lands

మేమూ దాడులు చేయగలం కానీ - తెలంగాణ ఇమేజ్ పాడవ్వొద్దని ఆగుతున్నాం : హరీశ్ రావు - HARISH RAO SLAMS CONGRESS GOVT

Last Updated : Sep 15, 2024, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.