ETV Bharat / politics

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్​ఎస్​కు దిష్టి తీసినట్లైంది - నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదు : కేసీఆర్​ - KCR Meet BRS Activists at Erravalli

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 10:09 PM IST

KCR Meet BRS Activists at Erravalli : బీఆర్ఎస్​ విజయ ప్రస్థానంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో దిష్టి తీసినట్లైందని మాజీ సీఎం, గులాబీ బాస్​ కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మహబూబాబాద్‌, మేడ్చల్‌, నల్గొండ జిల్లా నేతలు, కార్యకర్తలతో ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్‌ సర్కార్​ పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు.

KCR Meet BRS Activists at Erravalli
BRS Chief KCR Focus on Party Development (ETV Bharat)

BRS Chief KCR Focus on Party Development : శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్​ఎస్​ విజయ ప్రస్థానంలో నిన్నటి(లోక్​సభ) ఓటమితో దిష్టి తీసినట్లైందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ తెలిపారు. రెండున్నర దశాబ్దాల పార్టీ ప్రస్థానం ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవన్న ఆయన, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు.

ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ తర్వాత పదేళ్ల ప్రగతి పాలన వరకు తాను ఎదుర్కొన్న కష్టాలను ఆయన కార్యకర్తలకు వివరించారు.

చంద్రబాబును ఎదురించడం అంటే అంత ఆషామాషీ కాదు : ఆనాడు తెలంగాణను అష్ట దిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, అత్యంత శక్తిమంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, సమైక్య వాదానికి సింబాలిక్​గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. అటువంటి సమైక్యవాద, కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని వ్యాఖ్యానించారు.

గెలుపు, ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం తమకు ఎల్లవేళలా అండగా ఉందన్న ఆయన భవిష్యత్తులోనూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవికాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోందని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కర్చుకుంటున్నారని అన్నారు.

KCR Fires on Congress Party : ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ అన్ని రకాలుగా అండగా నిలబడిన బీఆర్​ఎస్​ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటోందని కేసీఆర్ తెలిపారు. తనపై ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని బీఆర్​ఎస్​ అధినేత స్పష్టం చేశారు.

తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అన్న ఆయన, ప్రజలు అనతికాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారన్న విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం వెతుక్కుంటూ బీఆర్​ఎస్​ కోసం వస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఓపికతో, ప్రజా సమస్యలపై పోరాడుతూ, వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.

తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్, ముందస్తు సమాచారంతో మాత్రమే తనను కలిసేందుకు రావాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఐదు, ఆరు గంటల పాటు నిలబడి ఫోటోలు దిగాలంటే తనకు ఇబ్బంది అవుతోందని అన్నారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతామని, చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరితోనూ మాట్లాడవచ్చని పేర్కొన్నారు.

ఒకరు పోతే పది మంది నాయకులను తయారు చేసుకుంటాం : కేసీఆర్​ - Ex CM KCR meets BRS MLAs

'ప్రజలు నాడు ఎన్టీఆర్​ ప్రభుత్వాన్ని తిరిగి ఎలా గద్దె మీద కూర్చోబెట్టారో - అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్​ను మళ్లీ ఆదరిస్తారు' - kcr meets brs activists

BRS Chief KCR Focus on Party Development : శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్​ఎస్​ విజయ ప్రస్థానంలో నిన్నటి(లోక్​సభ) ఓటమితో దిష్టి తీసినట్లైందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ తెలిపారు. రెండున్నర దశాబ్దాల పార్టీ ప్రస్థానం ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవన్న ఆయన, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు.

ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ తర్వాత పదేళ్ల ప్రగతి పాలన వరకు తాను ఎదుర్కొన్న కష్టాలను ఆయన కార్యకర్తలకు వివరించారు.

చంద్రబాబును ఎదురించడం అంటే అంత ఆషామాషీ కాదు : ఆనాడు తెలంగాణను అష్ట దిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, అత్యంత శక్తిమంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, సమైక్య వాదానికి సింబాలిక్​గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. అటువంటి సమైక్యవాద, కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని వ్యాఖ్యానించారు.

గెలుపు, ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం తమకు ఎల్లవేళలా అండగా ఉందన్న ఆయన భవిష్యత్తులోనూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవికాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోందని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కర్చుకుంటున్నారని అన్నారు.

KCR Fires on Congress Party : ప్రశాంతమైన పాలన ద్వారా పదేళ్ల పాటు సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ అన్ని రకాలుగా అండగా నిలబడిన బీఆర్​ఎస్​ను తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటోందని కేసీఆర్ తెలిపారు. తనపై ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో, ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని బీఆర్​ఎస్​ అధినేత స్పష్టం చేశారు.

తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్ వైఖరి అన్న ఆయన, ప్రజలు అనతికాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారన్న విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోందని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం వెతుక్కుంటూ బీఆర్​ఎస్​ కోసం వస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఓపికతో, ప్రజా సమస్యలపై పోరాడుతూ, వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.

తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్, ముందస్తు సమాచారంతో మాత్రమే తనను కలిసేందుకు రావాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఐదు, ఆరు గంటల పాటు నిలబడి ఫోటోలు దిగాలంటే తనకు ఇబ్బంది అవుతోందని అన్నారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతామని, చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరితోనూ మాట్లాడవచ్చని పేర్కొన్నారు.

ఒకరు పోతే పది మంది నాయకులను తయారు చేసుకుంటాం : కేసీఆర్​ - Ex CM KCR meets BRS MLAs

'ప్రజలు నాడు ఎన్టీఆర్​ ప్రభుత్వాన్ని తిరిగి ఎలా గద్దె మీద కూర్చోబెట్టారో - అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్​ను మళ్లీ ఆదరిస్తారు' - kcr meets brs activists

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.