ధ్యానంలో 'నరేంద్రుడు'- కాషాయ దుస్తుల్లో మోదీ మెడిటేషన్- ఫొటోలు చూశారా? - PM NARENDRA MODI MEDITATION
Published : May 31, 2024, 10:55 AM IST
PM Narendra Modi Meditation : తమిళనాడు కన్యాకుమారీలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ధ్యానం కొనసాగుతోంది. గురువారం రాత్రి వివేకానందుడు ధ్యానంలో గడిపిన ధ్యానమండపంలో మోదీ 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. అనంతరం కాషాయ దుస్తులతో, చేతిలో జపమాల పట్టుకుని మోదీ ధ్యానంలో నిమగ్నమయ్యారు. శుక్రవారం సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారాలు చేశారు. జూన్ 1 సాయంత్రం వరకు ప్రధాని ధ్యానం కొనసాగనుంది. (ANI)