ETV Bharat / offbeat

IRCTC అద్దిరిపోయే టూర్ - మధుర మీనాక్షి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాల సందర్శన! - IRCTC Tamil Nadu Hills and Temples

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

IRCTC Tamil Nadu Tour: తమిళనాడులోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను చూసేందుకు ఐఆర్​సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. మరి టూర్​ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Tamil Nadu Tour
IRCTC Tamil Nadu Hills and Temples Package (ETV Bharat)

IRCTC Tamil Nadu Hills and Temples Package: తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. మధుర మీనాక్షి ఆలయం, బృహదీశ్వర ఆలయం సహా మరెన్నో దేవాలయాలతోపాటు దర్శనీయ ప్రదేశాలు చూసేందుకు ఇండియన్​ రైల్వే కేటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ప్రయాణం ఎలా ఉంటుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

"తమిళనాడు హిల్స్​ అండ్​ టెంపుల్స్"​ పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో తిరుచ్చి, తంజావూర్​, మధురై, కొడైకెనాల్​, పళని, కోయంబత్తూరు​ వంటి ప్రాంతాలను చూడవచ్చు.

ప్రయాణం ఇలా ఉంటుంది:

మొదటి రోజు హైదరాబాద్​ విమానాశ్రయం నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తైన తర్వాత ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.

రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ చేసి శ్రీరంగం, జంబుకేశ్వర్​ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత తంజావూర్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురైకి వెళ్లి హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడ స్టే చేస్తారు.

మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కొడైకెనాల్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకుని సిల్వర్​ కాస్కేడ్​ ఫాల్స్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.

నాలుగో రోజు టిఫెన్​ తర్వాత కొడైకెనాల్​లోని చెట్టియార్ పార్క్, పైన్ ఫారెస్ట్, గుణ కేవ్స్​, కొడైకెనాల్ సరస్సు వంటివి సందర్శించుకుంటారు. ఆ రాత్రికి కూడా కొడైకెనాల్​లోనే బస చేస్తారు.

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు!

ఐదో రోజు అల్పాహారం తర్వాత హోటల్​ నుంచి చెక్ అవుట్​ అయ్యి పళని బయలుదేరుతారు. అక్కడ పళని మురుగన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కోయంబత్తూర్​ చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఆ నైట్​ అక్కడే ఉంటారు.

ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి Geede కార్​ మ్యూజియం, ఆదియోగి స్టాట్యూ​ సందర్శించి తిరిగి కోయంబత్తూర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్​పోర్ట్​కు వెళ్తారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్​ ఫ్లైట్ జర్నీ స్టార్ట్​ అవుతుంది. 9:30గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది. ​

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​లో.. సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.45వేలు, డబుల్​ షేరింగ్​కు రూ.34,350, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.32,800గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 26,900, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.23,550 చెల్లించాలి.
  • 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.16,550 పే చేయాలి.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • విమాన టికెట్లు(హైదరాబాద్​ - తిరుచ్చి/కోయంబత్తూర్​ - హైదరాబాద్​)
  • హోటల్​లో అకామిడేషన్​
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు ఉంటాయి..
  • సైట్​సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి బస్సులు కేటాయిస్తారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • టూర్​ ఎస్కార్ట్​ సర్వీసులు ఉంటాయి.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 5వ తేదీన అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

IRCTC Tamil Nadu Hills and Temples Package: తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. మధుర మీనాక్షి ఆలయం, బృహదీశ్వర ఆలయం సహా మరెన్నో దేవాలయాలతోపాటు దర్శనీయ ప్రదేశాలు చూసేందుకు ఇండియన్​ రైల్వే కేటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ప్రయాణం ఎలా ఉంటుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

"తమిళనాడు హిల్స్​ అండ్​ టెంపుల్స్"​ పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో తిరుచ్చి, తంజావూర్​, మధురై, కొడైకెనాల్​, పళని, కోయంబత్తూరు​ వంటి ప్రాంతాలను చూడవచ్చు.

ప్రయాణం ఇలా ఉంటుంది:

మొదటి రోజు హైదరాబాద్​ విమానాశ్రయం నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తైన తర్వాత ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.

రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ చేసి శ్రీరంగం, జంబుకేశ్వర్​ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత తంజావూర్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురైకి వెళ్లి హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడ స్టే చేస్తారు.

మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత మీనాక్షి అమ్మన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కొడైకెనాల్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకుని సిల్వర్​ కాస్కేడ్​ ఫాల్స్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.

నాలుగో రోజు టిఫెన్​ తర్వాత కొడైకెనాల్​లోని చెట్టియార్ పార్క్, పైన్ ఫారెస్ట్, గుణ కేవ్స్​, కొడైకెనాల్ సరస్సు వంటివి సందర్శించుకుంటారు. ఆ రాత్రికి కూడా కొడైకెనాల్​లోనే బస చేస్తారు.

కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్​ చేసిరావొచ్చు!

ఐదో రోజు అల్పాహారం తర్వాత హోటల్​ నుంచి చెక్ అవుట్​ అయ్యి పళని బయలుదేరుతారు. అక్కడ పళని మురుగన్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కోయంబత్తూర్​ చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఆ నైట్​ అక్కడే ఉంటారు.

ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి Geede కార్​ మ్యూజియం, ఆదియోగి స్టాట్యూ​ సందర్శించి తిరిగి కోయంబత్తూర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్​పోర్ట్​కు వెళ్తారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్​కు రిటర్న్​ ఫ్లైట్ జర్నీ స్టార్ట్​ అవుతుంది. 9:30గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది. ​

ధర వివరాలు చూస్తే:

  • కంఫర్ట్​లో.. సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.45వేలు, డబుల్​ షేరింగ్​కు రూ.34,350, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.32,800గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 26,900, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.23,550 చెల్లించాలి.
  • 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.16,550 పే చేయాలి.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • విమాన టికెట్లు(హైదరాబాద్​ - తిరుచ్చి/కోయంబత్తూర్​ - హైదరాబాద్​)
  • హోటల్​లో అకామిడేషన్​
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు ఉంటాయి..
  • సైట్​సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి బస్సులు కేటాయిస్తారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • టూర్​ ఎస్కార్ట్​ సర్వీసులు ఉంటాయి.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 5వ తేదీన అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.