ETV Bharat / offbeat

కూర్గ్​ అందాలను చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర చాలా తక్కువ! - IRCTC Koffee With Karnataka Package

author img

By ETV Bharat Features Team

Published : Aug 25, 2024, 5:26 PM IST

IRCTC Karnataka Tour Package: కర్ణాటకలోని ఫేమస్ టెంపుల్స్​తో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఐఆర్​సీటీసీ ఓ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Karnataka Tour Package
IRCTC Koffee With Karnataka Package (ETV Bharat)

IRCTC Koffee With Karnataka Package: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కూర్గ్​ చూసేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. కూర్గ్​ అందాలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూడొచ్చు. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్​సీటీటీ కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka) పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు/6 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్యాకేజీలో బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్​లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

ప్రయాణం ఇలా:

  • మొదటి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఉదయం 6:45గంటలకు ఫ్లైట్​ స్టార్ట్​ అవుతుంది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ పికప్ చేసుకుని మైసూర్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి మైసూర్ చేరుకుని హోటల్‌లో చెకిన్​ అవుతారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ విజిట్​ చేస్తారు. రాత్రికి మైసూర్‌లో బస ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మెల్కోటేకి బయలుదేరతారు. అక్కడ చెలువనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సోమనాథపుర, తలకాడు ఆలయాలకు బయలుదేరతారు. అక్కడ దర్శనం అనంతరం తిరిగి సాయంత్రానికి మైసూర్‌ చేరుకుంటారు. రాత్రికి మైసూర్​లోనే బస చేస్తారు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

  • మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత కూర్గ్‌కి బయలుదేరతారు. ఈ మార్గంలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా చూడవచ్చు. ఆ తర్వాత కూర్గ్ చేరుకుని హోటల్‌లో చెకిన్​ అవుతారు. మధ్యాహ్నం రాజా సీట్​ను సందర్శిస్తారు. రాత్రికి కూర్గ్‌లో బస ఉంటుంది.
  • నాలుగో రోజు హోటల్‌లో టిఫెన్​ తర్వాత తాలా కావేరికి వెళ్తారు. కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కూర్గ్​కు తిరిగి వెళ్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.
  • ఐదో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి సకలేష్‌పూర్‌కి బయలుదేరతారు. మంజీరాబాద్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం హాసన్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్‌లో దిగి, ఆ రాత్రికి హాసన్‌లోనే బస చేస్తారు.
  • హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి బేలూర్​కి బయలుదేరతారు. అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హళేబీడుకి వెళ్లి హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బెంగళూరుకు వస్తారు. సాయంత్రానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే:

  • ఈ ప్యాకేజీకి సంబంధించిన ధర వివరాలు(కంఫర్ట్​) చూస్తే.. సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.38,000, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.29,600, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.27,750గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.23,950, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.19,550గా నిర్ణయించారు.
  • 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.16,400 చెల్లించాలి.

రాజస్థాన్​ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ప్యాకేజీలో ఇవి ఉంటాయి:

  • హైదరాబాద్​ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్​కు విమాన టికెట్లు
  • 5 రాత్రులు హోటల్​లో బస
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు ఉంటాయి. లంచ్​ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు ఏర్పాటు చేస్తారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ సెప్టెంబర్​ 27 నుంచి స్టార్ట్​ అవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

IRCTC Koffee With Karnataka Package: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కూర్గ్​ చూసేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. కూర్గ్​ అందాలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూడొచ్చు. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్​సీటీటీ కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka) పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు/6 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్యాకేజీలో బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్​లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

ప్రయాణం ఇలా:

  • మొదటి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఉదయం 6:45గంటలకు ఫ్లైట్​ స్టార్ట్​ అవుతుంది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ పికప్ చేసుకుని మైసూర్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి మైసూర్ చేరుకుని హోటల్‌లో చెకిన్​ అవుతారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ విజిట్​ చేస్తారు. రాత్రికి మైసూర్‌లో బస ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మెల్కోటేకి బయలుదేరతారు. అక్కడ చెలువనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సోమనాథపుర, తలకాడు ఆలయాలకు బయలుదేరతారు. అక్కడ దర్శనం అనంతరం తిరిగి సాయంత్రానికి మైసూర్‌ చేరుకుంటారు. రాత్రికి మైసూర్​లోనే బస చేస్తారు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

  • మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత కూర్గ్‌కి బయలుదేరతారు. ఈ మార్గంలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా చూడవచ్చు. ఆ తర్వాత కూర్గ్ చేరుకుని హోటల్‌లో చెకిన్​ అవుతారు. మధ్యాహ్నం రాజా సీట్​ను సందర్శిస్తారు. రాత్రికి కూర్గ్‌లో బస ఉంటుంది.
  • నాలుగో రోజు హోటల్‌లో టిఫెన్​ తర్వాత తాలా కావేరికి వెళ్తారు. కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కూర్గ్​కు తిరిగి వెళ్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.
  • ఐదో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి సకలేష్‌పూర్‌కి బయలుదేరతారు. మంజీరాబాద్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం హాసన్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్‌లో దిగి, ఆ రాత్రికి హాసన్‌లోనే బస చేస్తారు.
  • హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి బేలూర్​కి బయలుదేరతారు. అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హళేబీడుకి వెళ్లి హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బెంగళూరుకు వస్తారు. సాయంత్రానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే:

  • ఈ ప్యాకేజీకి సంబంధించిన ధర వివరాలు(కంఫర్ట్​) చూస్తే.. సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.38,000, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.29,600, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.27,750గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.23,950, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.19,550గా నిర్ణయించారు.
  • 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.16,400 చెల్లించాలి.

రాజస్థాన్​ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ప్యాకేజీలో ఇవి ఉంటాయి:

  • హైదరాబాద్​ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్​కు విమాన టికెట్లు
  • 5 రాత్రులు హోటల్​లో బస
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు ఉంటాయి. లంచ్​ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
  • పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు ఏర్పాటు చేస్తారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ సెప్టెంబర్​ 27 నుంచి స్టార్ట్​ అవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.