ETV Bharat / offbeat

IRCTC కర్ణాటక టూర్​ - కూర్గ్​ అందాలతో పాటు ఈ ప్రదేశాలూ చూడొచ్చు- ధర తక్కువే! - IRCTC KOFFEE WITH KARNATAKA TOUR

-కర్ణాటకలోని ఫేమస్​ టెంపుల్స్​తో పాటు ప్రకృతి అందాలు వీక్షించేందుకు -ఐఆర్​సీటీసీ ఆరు రోజుల​ ప్యాకేజీ

IRCTC Koffee With Karnataka Tour
IRCTC Koffee With Karnataka Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2025, 3:49 PM IST

IRCTC Koffee With Karnataka Tour: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి.​ కూర్గ్​ అందాలతోపాటు ఇతర ప్రకృతి అందాలు, పలు దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఐఆర్​సీటీసీ టూరిజం "కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka)" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ​ఈ టూర్​ను​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ​ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో కూర్గ్, మైసూర్​లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. టూర్​ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే.

  • మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్​ నుంచి కాచిగూడ-మైసూర్​ ఎక్స్​ప్రెస్​(ట్రైన్​ నెం - 12785)లో జర్నీ​ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి కూర్గ్​ బయలుదేరుతారు. మధ్యాహ్నానికి కూర్గ్​ చేరుకుని హోటల్​లో చెకిన్​ అవుతారు. ఆ తర్వాత Abbey ఫాల్స్ విజిట్​ చేస్తారు. అలాగే ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరిగి హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్​లోనే బస చేస్తారు.
  • మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత తలా కావేరి(Talacauvery)కి వెళ్తారు. అక్కడ కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజా సీట్​ను విజిట్​ చేస్తారు. ఆ రాత్రికీ కూర్గ్​లోనే ఉంటారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ అయ్యి మైసూర్​ బయలుదేరుతారు. మార్గమధ్యలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా విజిట్​ చేస్తారు. ఆ తర్వాత మైసూర్​ చేరుకుని హోటల్​లో చెకిన్​ అయ్యి బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రికి మైసూర్‌లో వసతి ఉంటుంది.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ చెక్​ అవుట్​ చేసి చాముండి హిల్స్​, మైసూర్​ ప్యాలెస్​ విజిట్​ చేస్తారు. మధ్యాహ్నం రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. మూడు గంటలకు మైసూర్​ నుంచి హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ(ట్రైన్​ నెం 12786) ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

ధర వివరాలు చూస్తే:

1 నుంచి 3 ప్రయాణికులకు:

కంఫర్ట్(3AC):

  • సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.33,160, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.18,730, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.14,690గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.11,140, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.9,530గా నిర్ణయించారు.

స్టాండర్డ్​(SL):

  • సింగిల్​ షేరింగ్​కు రూ.31,140, ట్విన్​ షేరింగ్​కు రూ.16,710, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.12,670 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.9,120, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.7,510గా నిర్ణయించారు. గ్రూప్​ బుకింగ్​ పై కొంత మేర తగ్గుతుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు
  • 3 రాత్రులు హోటల్​లో బస, బ్రేక్​ఫాస్ట్​
  • లంచ్, డిన్నర్​​ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ జనవరి 29వ తేదీన మొదలవుతుంది.
  • పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోండి.

ఇండియా గేట్​, తాజ్​మహల్​ సహా ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - తక్కువ ధరకే IRCTC దిల్లీ టూర్​!

IRCTC "టెంపుల్ రన్" - కేరళ, తమిళనాడులో 7 రోజులపాటు దివ్యదర్శనాలు!

IRCTC Koffee With Karnataka Tour: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి.​ కూర్గ్​ అందాలతోపాటు ఇతర ప్రకృతి అందాలు, పలు దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఐఆర్​సీటీసీ టూరిజం "కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka)" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ​ఈ టూర్​ను​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ​ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో కూర్గ్, మైసూర్​లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. టూర్​ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే.

  • మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్​ నుంచి కాచిగూడ-మైసూర్​ ఎక్స్​ప్రెస్​(ట్రైన్​ నెం - 12785)లో జర్నీ​ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి కూర్గ్​ బయలుదేరుతారు. మధ్యాహ్నానికి కూర్గ్​ చేరుకుని హోటల్​లో చెకిన్​ అవుతారు. ఆ తర్వాత Abbey ఫాల్స్ విజిట్​ చేస్తారు. అలాగే ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరిగి హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్​లోనే బస చేస్తారు.
  • మూడో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత తలా కావేరి(Talacauvery)కి వెళ్తారు. అక్కడ కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజా సీట్​ను విజిట్​ చేస్తారు. ఆ రాత్రికీ కూర్గ్​లోనే ఉంటారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ అయ్యి మైసూర్​ బయలుదేరుతారు. మార్గమధ్యలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా విజిట్​ చేస్తారు. ఆ తర్వాత మైసూర్​ చేరుకుని హోటల్​లో చెకిన్​ అయ్యి బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రికి మైసూర్‌లో వసతి ఉంటుంది.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ చెక్​ అవుట్​ చేసి చాముండి హిల్స్​, మైసూర్​ ప్యాలెస్​ విజిట్​ చేస్తారు. మధ్యాహ్నం రైల్వేస్టేషన్​కు చేరుకుంటారు. మూడు గంటలకు మైసూర్​ నుంచి హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ(ట్రైన్​ నెం 12786) ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

ధర వివరాలు చూస్తే:

1 నుంచి 3 ప్రయాణికులకు:

కంఫర్ట్(3AC):

  • సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.33,160, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.18,730, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.14,690గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.11,140, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.9,530గా నిర్ణయించారు.

స్టాండర్డ్​(SL):

  • సింగిల్​ షేరింగ్​కు రూ.31,140, ట్విన్​ షేరింగ్​కు రూ.16,710, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.12,670 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.9,120, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.7,510గా నిర్ణయించారు. గ్రూప్​ బుకింగ్​ పై కొంత మేర తగ్గుతుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు
  • 3 రాత్రులు హోటల్​లో బస, బ్రేక్​ఫాస్ట్​
  • లంచ్, డిన్నర్​​ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ జనవరి 29వ తేదీన మొదలవుతుంది.
  • పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోండి.

ఇండియా గేట్​, తాజ్​మహల్​ సహా ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - తక్కువ ధరకే IRCTC దిల్లీ టూర్​!

IRCTC "టెంపుల్ రన్" - కేరళ, తమిళనాడులో 7 రోజులపాటు దివ్యదర్శనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.