ETV Bharat / offbeat

తెలంగాణ To అరుణాచలం - ఈ సూపర్ టూర్​ ​ప్యాకేజీని మిస్​ చేసుకోకండి! - Arunachalam Tour Package

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 11:34 AM IST

Telangana Tourism Arunachalam Package : శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర పుణ్యక్షేత్రమే.. అరుణాచలం. నిత్యం ఎంతో మంది భక్తులు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఆ పరమశివుడి అనుగ్రహం పొందుతుంటారు. మీరు కూడా అరుణాచలేశ్వరుడిని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారా? మీ కోసం తక్కువ బడ్జెట్​లో తెలంగాణ టూరిజం ఒక ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Telangana Tourism Arunachalam Package
Telangana Tourism Arunachalam Package (ETV Bharat)

Hyderabad to Arunachalam Tour Package : అరుణాచలం.. తమిళనాడులోని ప్రసిద్ధమైన శైవక్షేత్రాలలో ముందు వరుసలో కనిపిస్తుంది. అక్కడి వారు ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలైగా పిలుచుకుంటారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఒక్కసారి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

అందుకే.. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఎంతో మంది ఆ శివుడి అనుగ్రహం పొందడానికి తరలి వెళ్తుంటారు. మీరు కూడా అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే, మీకో గుడ్​న్యూస్​. హైదరాబాద్​ నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఈ ట్రిప్​కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్​ 15వ తేదీ రోజు అందుబాటులో ఉంది. ఈ నెలలో టూర్​ మిస్​ అయితే మళ్లీ వచ్చే అక్టోబర్​లో టూర్​కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్​లో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి.

హైదరాబాద్ - అరుణాచలం పర్యటన ఇలా ఉంటుంది :

  • మొదటి రోజు టూర్ హైదరాబాద్​లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
  • రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
  • మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం రీచ్​ అవుతారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. నైట్​ అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడవ రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత.. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
  • నాలుగవ రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పూర్తవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ టూర్​లో టికెట్ ధర పెద్దలకు రూ.8,000 పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, అకామడేషన్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
  • టూర్​ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇవి కూడా చదవండి :

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

"నాగార్జున సాగర్" టూర్ - కేవలం రూ.800లకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!

Hyderabad to Arunachalam Tour Package : అరుణాచలం.. తమిళనాడులోని ప్రసిద్ధమైన శైవక్షేత్రాలలో ముందు వరుసలో కనిపిస్తుంది. అక్కడి వారు ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలైగా పిలుచుకుంటారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఒక్కసారి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

అందుకే.. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఎంతో మంది ఆ శివుడి అనుగ్రహం పొందడానికి తరలి వెళ్తుంటారు. మీరు కూడా అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే, మీకో గుడ్​న్యూస్​. హైదరాబాద్​ నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఈ ట్రిప్​కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్​ 15వ తేదీ రోజు అందుబాటులో ఉంది. ఈ నెలలో టూర్​ మిస్​ అయితే మళ్లీ వచ్చే అక్టోబర్​లో టూర్​కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్​లో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి.

హైదరాబాద్ - అరుణాచలం పర్యటన ఇలా ఉంటుంది :

  • మొదటి రోజు టూర్ హైదరాబాద్​లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
  • రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
  • మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం రీచ్​ అవుతారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. నైట్​ అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడవ రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత.. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
  • నాలుగవ రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పూర్తవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ టూర్​లో టికెట్ ధర పెద్దలకు రూ.8,000 పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, అకామడేషన్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
  • టూర్​ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇవి కూడా చదవండి :

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!

"నాగార్జున సాగర్" టూర్ - కేవలం రూ.800లకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.