ETV Bharat / international

నిజ్జర్​కు కెనడా పార్లమెంట్ నివాళి- గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్ - INDIA ON CANADA

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 3:46 PM IST

India On Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగి ఏడాదైన సందర్భంగా ట్రూడో సర్కారు ప్రత్యేకంగా నివాళులర్పించింది. ఆ దేశ పార్లమెంటులో సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి కెనడా నివాళులర్పించడం వల్ల భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. 1985లో ఎయిర్‌ ఇండియా కనిష్కా విమానంపై ఖలిస్థానీ ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన 329 మందికి ఈ నెల 23న నివాళులర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడాలోని ఇండియా కన్సులేట్ జనరల్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

India Fired On Canada
India Fired On Canada (Source: Getty Images (Left), ANI (Right))

India On Canada : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తికి పార్లమెంటులో కెనడా ప్రత్యేకంగా నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు. సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యలందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భంగా నిజ్జర్‌ జ్ఞాపకార్థం మౌనం పాటించాలని నిర్ణయించినట్లు ఆ దేశ పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ తెలిపారు.

2023 జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య జరిగింది. ఈ ఘటన వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఏ ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా సర్కారు నలుగురు భారతీయులను అరెస్టు చేసింది.

భారత్‌ గట్టి కౌంటర్‌
అటు నిజ్జర్‌కు నివాళి ఆర్పించిన వ్యవహారంలో కెనడాకు భారత్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. 1985లో ఎయిర్‌ ఇండియా కనిష్కా విమానంపై ఖలిస్థాని ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన 329 మందికి ఈనెల 23న నివాళులర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడాలోని ఇండియా కన్సులేట్ జనరల్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈనెల 23 నాటికి బాంబు దాడి జరిగి 39 ఏళ్లు అయిన సందర్భంగా స్మారకసభను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందు ఉండటంతో పాటు ఈ విషయంలో అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.

1985లో ఎయిర్‌ ఇండియా కనిష్కా విమానంపై జరిపిన దాడి పౌర విమానయాన రంగంలోనే అతిపెద్దని వెల్లడించింది. 86 మంది పిల్లలు సహా 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వారి జ్ఞాపకార్థం ఈనెల 23న సాయంత్రం ఆరున్నర గంటలకు స్టాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లే గ్రౌండ్‌లోని ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప సభ ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలని ప్రవాస భారతీయులను కోరింది.

కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమానంలో కెనడా పౌరసత్వం కలిగిన ఖలిస్థానీ ఉగ్రవాది బాంబును అమర్చాడు. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలడం వల్ల అందులో ఉన్న 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటన్‌ పౌరులు, 24 మంది భారత పౌరులు ఉన్నారు.

ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు- భారత సంతతికి చెందిన వారే! - Nijjar Death Case

కెనడా మీడియాలో నిజ్జర్‌ హత్య దృశ్యాలు వైరల్- 9నెలల తర్వాత వెలుగులోకి!

India On Canada : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ విషయంలో కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తికి పార్లమెంటులో కెనడా ప్రత్యేకంగా నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు. సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యలందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చిన సందర్భంగా నిజ్జర్‌ జ్ఞాపకార్థం మౌనం పాటించాలని నిర్ణయించినట్లు ఆ దేశ పార్లమెంటులో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ తెలిపారు.

2023 జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య జరిగింది. ఈ ఘటన వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఏ ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా సర్కారు నలుగురు భారతీయులను అరెస్టు చేసింది.

భారత్‌ గట్టి కౌంటర్‌
అటు నిజ్జర్‌కు నివాళి ఆర్పించిన వ్యవహారంలో కెనడాకు భారత్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది. 1985లో ఎయిర్‌ ఇండియా కనిష్కా విమానంపై ఖలిస్థాని ఉగ్రవాది జరిపిన బాంబు దాడిలో మృతి చెందిన 329 మందికి ఈనెల 23న నివాళులర్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కెనడాలోని ఇండియా కన్సులేట్ జనరల్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈనెల 23 నాటికి బాంబు దాడి జరిగి 39 ఏళ్లు అయిన సందర్భంగా స్మారకసభను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందు ఉండటంతో పాటు ఈ విషయంలో అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోందని తెలిపింది.

1985లో ఎయిర్‌ ఇండియా కనిష్కా విమానంపై జరిపిన దాడి పౌర విమానయాన రంగంలోనే అతిపెద్దని వెల్లడించింది. 86 మంది పిల్లలు సహా 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వారి జ్ఞాపకార్థం ఈనెల 23న సాయంత్రం ఆరున్నర గంటలకు స్టాన్లీ పార్క్‌లోని సెపర్లీ ప్లే గ్రౌండ్‌లోని ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప సభ ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలని ప్రవాస భారతీయులను కోరింది.

కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమానంలో కెనడా పౌరసత్వం కలిగిన ఖలిస్థానీ ఉగ్రవాది బాంబును అమర్చాడు. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో బాంబు పేలడం వల్ల అందులో ఉన్న 329 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటన్‌ పౌరులు, 24 మంది భారత పౌరులు ఉన్నారు.

ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు- భారత సంతతికి చెందిన వారే! - Nijjar Death Case

కెనడా మీడియాలో నిజ్జర్‌ హత్య దృశ్యాలు వైరల్- 9నెలల తర్వాత వెలుగులోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.