ETV Bharat / international

బస్సులను ఆపి, కిందకు దింపి మరీ కాల్పులు- పాక్​లో 33 మంది దుర్మరణం - 23 PASSENGERS KILLED IN PAKISTAN

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 11:16 AM IST

Updated : Aug 26, 2024, 11:36 AM IST

Gunmen Kills Bus Passengers In Pakistan : పాకిస్థాన్​లో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిని రెండు వేర్వేరు ఘటనల్లో విచక్షణారహితంగా కాల్చిచంపారు కొందరు సాయుధులు. తర్వాత పన్నెండు వాహనాలకు నిప్పుపెట్టారు.

Gunmen kill 23 bus passengers in PAK
Gunmen kill 23 bus passengers in PAK (ETV Bharat)

Gunmen Kills Bus Passengers In Pakistan : పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ ప్రావిన్స్​లో సాయుధులు మరోసారి రెచ్చిపోయారు. రెండు ఘటనల్లో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిని సాయుధులు కిందకు దింపి మరీ కాల్చి చంపారు. తర్వాత 12 వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. అనంతరం పర్వత భూభాగంలోకి సాయుధులు పారిపోయారు. ఈ దారుణ ఘటన బలూచిస్థాన్​లోని ముసాఖేల్ జిల్లాలో సోమవారం జరిగింది.

అసలేం జరిగిందంటే?
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో ​తెలిపిన వివరాల ప్రకారం, ముసాఖేల్​ జిల్లాలోని రరాషమ్​ ప్రాంతీయ రహదారిపై వెళ్తున్న బస్సును సాయుధులు ఆపారు. తర్వాత ప్రయాణికుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత 23 మందిని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా పంజాబ్​ ప్రావిన్స్​కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది దక్షిణ పంజాబ్​కు చెందినవారని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఈ దాడికి ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. మరో ఘటనలో బలూచిస్థాన్‌లోని ఖలాత్ జిల్లాలో ముష్కరులు నలుగురు పోలీసు అధికారులతో సహా కనీసం 10 మందిని హతమార్చారని అధికారులు తెలిపారు.

ఖండించిన బలూచిస్థాన్ సీఎం
ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్​ బుగ్తీ తీవ్రంగా ఖండిచారు. సాయుధుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయుధులను, వారికి సహకరించేవారిని వదిలిబెట్టబోమని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పంజాబ్ ప్రజలే టార్గెట్!
పంజాబ్‌ ప్రావిన్స్​కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇదే తరహా దాడి నాలుగు నెలల క్రితం బలూచిస్థాన్​లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో నోష్కి సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సు నుంచి దింపారు సాయుధులు. అనంతరం వారి ఐడీ కార్డులను తనిఖీ చేసి చంపేశారు. గతేడాది అక్టోబరులో కూడా కచ్ జిల్లాలోని టర్బత్ ప్రాంతంలో పంజాబ్​కు చెందిన ఆరుగురు కూలీలను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. మృతులందరూ దక్షిణ పంజాబ్​కు చెందినవారే. 2015లో తుర్బాత్ సమీపంలోని కార్మికుల శిబిరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది నిర్మాణ కార్మికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Gunmen Kills Bus Passengers In Pakistan : పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ ప్రావిన్స్​లో సాయుధులు మరోసారి రెచ్చిపోయారు. రెండు ఘటనల్లో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిని సాయుధులు కిందకు దింపి మరీ కాల్చి చంపారు. తర్వాత 12 వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. అనంతరం పర్వత భూభాగంలోకి సాయుధులు పారిపోయారు. ఈ దారుణ ఘటన బలూచిస్థాన్​లోని ముసాఖేల్ జిల్లాలో సోమవారం జరిగింది.

అసలేం జరిగిందంటే?
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో ​తెలిపిన వివరాల ప్రకారం, ముసాఖేల్​ జిల్లాలోని రరాషమ్​ ప్రాంతీయ రహదారిపై వెళ్తున్న బస్సును సాయుధులు ఆపారు. తర్వాత ప్రయాణికుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత 23 మందిని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా పంజాబ్​ ప్రావిన్స్​కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది దక్షిణ పంజాబ్​కు చెందినవారని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఈ దాడికి ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. మరో ఘటనలో బలూచిస్థాన్‌లోని ఖలాత్ జిల్లాలో ముష్కరులు నలుగురు పోలీసు అధికారులతో సహా కనీసం 10 మందిని హతమార్చారని అధికారులు తెలిపారు.

ఖండించిన బలూచిస్థాన్ సీఎం
ఈ ఘటనను బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్​ బుగ్తీ తీవ్రంగా ఖండిచారు. సాయుధుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయుధులను, వారికి సహకరించేవారిని వదిలిబెట్టబోమని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పంజాబ్ ప్రజలే టార్గెట్!
పంజాబ్‌ ప్రావిన్స్​కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇదే తరహా దాడి నాలుగు నెలల క్రితం బలూచిస్థాన్​లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో నోష్కి సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సు నుంచి దింపారు సాయుధులు. అనంతరం వారి ఐడీ కార్డులను తనిఖీ చేసి చంపేశారు. గతేడాది అక్టోబరులో కూడా కచ్ జిల్లాలోని టర్బత్ ప్రాంతంలో పంజాబ్​కు చెందిన ఆరుగురు కూలీలను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. మృతులందరూ దక్షిణ పంజాబ్​కు చెందినవారే. 2015లో తుర్బాత్ సమీపంలోని కార్మికుల శిబిరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది నిర్మాణ కార్మికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Last Updated : Aug 26, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.