ETV Bharat / health

భోజనం స్కిప్ చేస్తున్నారా? కొబ్బరి నీళ్లైనా తాగడం లేదా? అయితే కష్టమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 7:45 AM IST

Updated : Feb 25, 2024, 9:18 AM IST

Skip Meals Side Effects In Telugu : శరీరం అనే బండి సాఫీగా నడిచేందుకు ఆహారం అనే ఇంధనాన్ని మూడు పూటలా అందించాలి. బిజీగా ఉండటం వల్ల తరచూ తిండి మానేస్తూ ఉంటే దాని ప్రభావం శరీరంపై తీవ్రంగా పడుతుంది. అయితే సమయానికి తినకపోవడం, ఆహారాన్ని స్కిప్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం.

Skip Meals Side Effects In Telugu
Skip Meals Side Effects In Telugu

Skip Meals Side Effects In Telugu : ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గాలని సరిగ్గా ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. ఒక పూట తింటే మరో పూట ఎగ్గొడుతున్నారు. మరి కొందరైతే పనుల్లో పడి తినడానికి కూడా సమయాన్ని కేటాయించట్లేదు. ఇక ఇంట్లోని మహిళల విషయానికొస్తే పిల్లల్ని స్కూల్​కు పంపే హడావిడిలో పడి బ్రేక్​ఫాస్ట్​ చేయడమే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకుని నేరుగా లంచ్ చేసేస్తున్నారు. ఇలా భోజనం మానేయడం, వేళకు తినకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా భోజనాన్ని సమయానికి తినకపోవడం, స్కిప్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

సమయానికి తిండి తినకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్​ స్థాయి పడిపోతుంది. దీని వల్ల శరీర అవయవాల పని తీరు నెమ్మదిస్తుంది. భోజనం మానేసినప్పుడు మెదడుకు తగినంత శక్తి లభించదు. తద్వారా మన శరీరం నీరసంగా, అలసటగా ఉంటుంది. అంతేకాకుండా ఏకాగ్రత సైతం లోపిస్తుంది. అందుకే సమయానికి తినడం, అన్ని పూటలూ ఆహారం తీసుకోవడం ముఖ్యమని పోషాకాహార నిపుణులు సూచిస్తున్నారు.

'జీవక్రియల వేగం తగ్గుతుంది'
పదే పదే భోజనం మానేయడం వల్ల శరీరం శక్తిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల జీవక్రియల వేగం తగ్గుతుంది. బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రికి ఎక్కువగా ఆహరం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని వల్ల ఇన్సులిన్ స్పందించే వేగం తగ్గిపోతుంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్త్​లో మధుమేహానికి గురయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ భోజనం మానేసే వాళ్లలో విటమిన్ లోపాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినపుడు అది తట్టుకోవడానికి మన శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ సేపు పొట్టని ఖాళీగా ఉంచడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఎసిడిటీ, పుల్లటి తేనుపులతో పాటు కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు భోజనం మానేయకుండా, సరైన సమయానికి తినాలి. భోజనం చేసే తీరిక లేనపుడు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ లాంటి ద్రవాలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బయట తింటున్నారా? - ఈ ఫుడ్​కు కచ్చితంగా నో చెప్పండి!

మానసిక ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దెబ్బ! - మీరు ఇవి తింటున్నారా?

Skip Meals Side Effects In Telugu : ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గాలని సరిగ్గా ఆహారం తీసుకోవడం మానేస్తున్నారు. ఒక పూట తింటే మరో పూట ఎగ్గొడుతున్నారు. మరి కొందరైతే పనుల్లో పడి తినడానికి కూడా సమయాన్ని కేటాయించట్లేదు. ఇక ఇంట్లోని మహిళల విషయానికొస్తే పిల్లల్ని స్కూల్​కు పంపే హడావిడిలో పడి బ్రేక్​ఫాస్ట్​ చేయడమే మర్చిపోతున్నారు. వంట పనులన్నీ పూర్తి చేసుకుని నేరుగా లంచ్ చేసేస్తున్నారు. ఇలా భోజనం మానేయడం, వేళకు తినకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా భోజనాన్ని సమయానికి తినకపోవడం, స్కిప్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

సమయానికి తిండి తినకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్​ స్థాయి పడిపోతుంది. దీని వల్ల శరీర అవయవాల పని తీరు నెమ్మదిస్తుంది. భోజనం మానేసినప్పుడు మెదడుకు తగినంత శక్తి లభించదు. తద్వారా మన శరీరం నీరసంగా, అలసటగా ఉంటుంది. అంతేకాకుండా ఏకాగ్రత సైతం లోపిస్తుంది. అందుకే సమయానికి తినడం, అన్ని పూటలూ ఆహారం తీసుకోవడం ముఖ్యమని పోషాకాహార నిపుణులు సూచిస్తున్నారు.

'జీవక్రియల వేగం తగ్గుతుంది'
పదే పదే భోజనం మానేయడం వల్ల శరీరం శక్తిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల జీవక్రియల వేగం తగ్గుతుంది. బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా రాత్రికి ఎక్కువగా ఆహరం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీని వల్ల ఇన్సులిన్ స్పందించే వేగం తగ్గిపోతుంది. ఈ పరిణామం వల్ల భవిష్యత్త్​లో మధుమేహానికి గురయ్యే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ భోజనం మానేసే వాళ్లలో విటమిన్ లోపాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినపుడు అది తట్టుకోవడానికి మన శరీరం కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ సేపు పొట్టని ఖాళీగా ఉంచడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఎసిడిటీ, పుల్లటి తేనుపులతో పాటు కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు భోజనం మానేయకుండా, సరైన సమయానికి తినాలి. భోజనం చేసే తీరిక లేనపుడు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ లాంటి ద్రవాలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బయట తింటున్నారా? - ఈ ఫుడ్​కు కచ్చితంగా నో చెప్పండి!

మానసిక ఆరోగ్యంపై అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ దెబ్బ! - మీరు ఇవి తింటున్నారా?

Last Updated : Feb 25, 2024, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.