Pawan Kalyan Pen : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ తన మరిది పవన్కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన లిమిటెడ్ ఎడిషన్ పెన్ను బహుమతిగా అందించారు.
దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి" అంటూ ఓ స్వీట్ క్యాఫ్షన్ను కూడా రాసుకొచ్చారు. "తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ - వదిన, అన్నయ్య"
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఆ పెన్ ధర తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతికేశారు. తీరా ధర తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ పెన్ ధర దాదాపు రూ. 80 వేల నుంచి రూ.మూడు లక్షల లోపల అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ పెన్ ధర కరెక్ట్గా ఎంత అని తెలియనప్పటికీ చాలా ఖరీదే అని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, మరికొందరు నెటిజన్లు ఈ పోస్ట్పై ఫన్నీగా మీమ్స్ వేస్తున్నారు. ఆ పెన్ ధర గురించి సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్కల్యాణ్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొందడమే కాకుండా పార్టీ నుంచి బరిలో నిలిచిన ప్రతీ అభ్యర్థి గెలిచేలా ఎంతో శ్రమించారు. ఇటీవలె ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పంచాయతీరాజ్ సహా పలు కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి ఇలా మధుర క్షణాలను పంచుకున్నారు. ఈ వీడియోలో పవన్ సతీమణి అన్న లెజినీవా కూడా ఉన్నారు.
'వాళ్ల నాన్న కోసం నా పిల్లలు ఇలా రెడీ అయ్యారు' - రేణూ దేశాయ్ ఎమోషనల్ - Renu Desai Instagram Post
పవన్ కల్యాణ్ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్ - Pawankalyan Renudesai