Miss Universe India 2024 : ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా క్రౌన్ను గుజరాత్కు చెందిన రియా సింఘా అందుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. సుమారు 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఈ పోటీలకు జడ్జీగా వ్యవహరించారు.
ఇక మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రియా అన్నారు."ఈ రోజు నేను టైటిల్ గెలుచుకున్న మూమెంట్ను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కాంపిటిషన్లో పాల్గొనడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఈ పొజిషన్కు చేరుకోవడం వెనక ఎంతో కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను" అని రియా అన్నారు.
#WATCH | Jaipur, Rajasthan: Rhea Singha crowned Miss Universe India 2024. pic.twitter.com/U76NE7yKlL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 22, 2024