ETV Bharat / entertainment

కంగన 'ఎమర్జెన్సీ'కి సెన్సార్ క్లియర్- రిలీజ్ ఎప్పుడంటే?

Kangana Ranaut Emergency Movie : బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Kangana Ranaut Emergency
Kangana Ranaut Emergency (Source: ANI)

Kangana Ranaut Emergency Movie : బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని కంగన వెల్లడించారు. 'ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని తెలుపడానికి సంతోషిస్తున్నాం. సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం. ఓపికతో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అని కంగన తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.

కంగన స్వీయ దర్శకత్వంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల పట్ల ఓ వర్గం వారు అభ్యంతరం తెలుపుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సెన్సార్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. పలు సన్నివేశాలను తొలగించడానికి మేకర్స్​ ఒప్పుకోవడం వల్ల తాజాగా సర్టిఫికెట్ జారీ అయ్యింది.

కాగా, ఇందులో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్​పై ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిలింద్ సొమన్, శ్రేయా తల్పడే, భూమికా చావ్లా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సిఉండగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాని కారణంగా వాయిదా పడింది.

Kangana Ranaut Emergency Movie : బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని కంగన వెల్లడించారు. 'ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని తెలుపడానికి సంతోషిస్తున్నాం. సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం. ఓపికతో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అని కంగన తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు.

కంగన స్వీయ దర్శకత్వంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇందులో కొన్ని సన్నివేశాల పట్ల ఓ వర్గం వారు అభ్యంతరం తెలుపుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు సెన్సార్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. పలు సన్నివేశాలను తొలగించడానికి మేకర్స్​ ఒప్పుకోవడం వల్ల తాజాగా సర్టిఫికెట్ జారీ అయ్యింది.

కాగా, ఇందులో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. మణికర్ణిక ఫిల్మ్ బ్యానర్​పై ఈ సినిమా రూపొందింది. బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిలింద్ సొమన్, శ్రేయా తల్పడే, భూమికా చావ్లా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సిఉండగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాని కారణంగా వాయిదా పడింది.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.