ETV Bharat / entertainment

భారీ బడ్జెట్ ఇండియన్​​ సీరియల్​ ఇదే - RRR, కల్కి, ఆదిపురుష్ బడ్జెట్​ కన్నా ఎక్కువ! - Indian Most Expensive TV Show

Indian Most Expensive TV Serial Show : ఇండియన్ ఫిల్మ్​ ఇండిస్ట్రీలో ఏ సినిమా కూడా తెరకెక్కని రేంజ్​లో ఓ టీవీ సీరియల్​ను నిర్మించారు. దాని బడ్జెట్​ RRR, కల్కి, ఆదిపురుష్ కన్నా ఎక్కువ. అవును మీరు చదివింది నిజం. ఇంతకీ అదేంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 4:41 PM IST

Source Getty images
Indian Most Expensive TV Serial Show (Source Getty images)

Indian Most Expensive TV Serial Show : సినిమా, సీరియల్, సిరీస్​, ఎంటర్​టైన్మెంట్ షోస్ ఏదైనా వీటి అంతిమ లక్ష్యం ప్రేక్షకుల్ని అలరించి ఆకట్టుకోవడమే. బుల్లితెరపై లేదా థియేటర్లలో ఇవి ప్రసారమవుతూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటాయి. అయితే ఒకప్పుడు సీరియల్​, ఎంటర్​టైన్మెంట్​ షోస్​తో పోలిస్తే ​సినిమా బడ్జెట్​ మాత్రమే ఎక్కువగా ఉండేది. సీరియల్స్​ చాలా తక్కువ ఖర్చుతో తెరకెక్కించేవారు. గతంలో భారతీయ టెలివిజన్‌లో హద్దులు చెరిపేసిన రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ కూడా మెగా బడ్జెట్‌లో రూపొందలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. శతాబ్ద కాలం తర్వాత భారతీయ టెలివిజన్ కార్యక్రమాల బడ్జెట్లు, ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగా పెరిగిపోయాయి. ఎక్కువ బడ్జెట్​ అయినా పెట్టేందుకు వెనకాడట్లేదు. సిరీస్​లు కూడా సినిమా రేంజ్​ బడ్జెట్​తో తెరకెక్కుతున్నాయి.

అయితే వీటిల్లో ఓ టెలివిజన్ సీరియల్ ఉంది. దాని బడ్జెట్​ ఎంతంటే ప్రస్తుతం ఇండియన్ ఇండిస్ట్రీలో ఏ సినిమా కూడా ఆ రేంజ్ భారీ బడ్జెట్​తో నిర్మించలేదు. అవును మీరు చదివేది నిజం. 2019లో సిద్ధార్థ్ కుమార్ తివారి రామాయణం ఆధారంగా రామ్ సియా కె లవ్ కుష్ అనే మైథాలాజికల్ సీరియల్​ను రూపొందించారు. ఆ సమయంలో భారతీయ టెలివిజన్‌లో ఇదే అతిపెద్ద షో. ఈ షోకు సంబంధించిన ఒక్కో ఎపిసోడ్ రూపొందించడానికి సుమారు రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేశారట. మిడ్-డే నివేదిక ప్రకారం దీని మొత్తం నిర్మాణ వ్యయం రూ. 650 కోట్లు అని ఉంది. అంటే మరో ఇతర సీరియల్ కానీ, సినిమా కానీ ఇంత బడ్జెట్‌లో రాలేదనే చెప్పాలి.

అందుకే దీనిని బాహుబలితో పోలుస్తుంటారు. టీవీ బాహుబలి అని పిలుస్తుంటారు. 2019లో ఈ సీరియల్​ ప్రసారమైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా సాహో ఉండేది. ఈ మూవీ బడ్జెట్ రూ. 350 కోట్లు. అంటే రామ్ సియా కే లవ్ కుష్ షో దీనికి డబుల్​ అన్న మాట.

ఇక రూ. 500 కోట్లతో తెరకెక్కిన ఆర్​ఆర్​ఆర్​, రూ.400 కోట్లతో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమాలు కూడా ఈ సీరియల్ బడ్జెట్‌ను టచ్ చేయలేకపోయాయి. 2023లో రామాయణం ఆధారంగా వచ్చిన ఆదిపురుష్ కూడా రూ. 550 కోట్లతోనే తెరకెక్కింది. సలార్​, ప్రాజెక్ట్ కె, పూష్ప 2 కూడా రూ.600కోట్లు దాటట్లేదు. అంటే రామ్ సియా కే లవ్ కుష్ కన్నా ఇవి తక్కువే. కాగా, ఈ టెలివిజన్ షో ఆగస్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు ప్రసారమైంది. మొత్తం 141 ఎపిసోడ్‌లు ఉన్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి - ఎరుపెక్కిన గోదావ‌రి - Gangs Of Godavari Review

అల్లు అర్జున్​ 'పుష్ప 2'కు పోటీగా దిగిన కీర్తిసురేశ్​ - Alluarjun VS Keerthi Suresh

Indian Most Expensive TV Serial Show : సినిమా, సీరియల్, సిరీస్​, ఎంటర్​టైన్మెంట్ షోస్ ఏదైనా వీటి అంతిమ లక్ష్యం ప్రేక్షకుల్ని అలరించి ఆకట్టుకోవడమే. బుల్లితెరపై లేదా థియేటర్లలో ఇవి ప్రసారమవుతూ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటాయి. అయితే ఒకప్పుడు సీరియల్​, ఎంటర్​టైన్మెంట్​ షోస్​తో పోలిస్తే ​సినిమా బడ్జెట్​ మాత్రమే ఎక్కువగా ఉండేది. సీరియల్స్​ చాలా తక్కువ ఖర్చుతో తెరకెక్కించేవారు. గతంలో భారతీయ టెలివిజన్‌లో హద్దులు చెరిపేసిన రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ కూడా మెగా బడ్జెట్‌లో రూపొందలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. శతాబ్ద కాలం తర్వాత భారతీయ టెలివిజన్ కార్యక్రమాల బడ్జెట్లు, ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగా పెరిగిపోయాయి. ఎక్కువ బడ్జెట్​ అయినా పెట్టేందుకు వెనకాడట్లేదు. సిరీస్​లు కూడా సినిమా రేంజ్​ బడ్జెట్​తో తెరకెక్కుతున్నాయి.

అయితే వీటిల్లో ఓ టెలివిజన్ సీరియల్ ఉంది. దాని బడ్జెట్​ ఎంతంటే ప్రస్తుతం ఇండియన్ ఇండిస్ట్రీలో ఏ సినిమా కూడా ఆ రేంజ్ భారీ బడ్జెట్​తో నిర్మించలేదు. అవును మీరు చదివేది నిజం. 2019లో సిద్ధార్థ్ కుమార్ తివారి రామాయణం ఆధారంగా రామ్ సియా కె లవ్ కుష్ అనే మైథాలాజికల్ సీరియల్​ను రూపొందించారు. ఆ సమయంలో భారతీయ టెలివిజన్‌లో ఇదే అతిపెద్ద షో. ఈ షోకు సంబంధించిన ఒక్కో ఎపిసోడ్ రూపొందించడానికి సుమారు రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేశారట. మిడ్-డే నివేదిక ప్రకారం దీని మొత్తం నిర్మాణ వ్యయం రూ. 650 కోట్లు అని ఉంది. అంటే మరో ఇతర సీరియల్ కానీ, సినిమా కానీ ఇంత బడ్జెట్‌లో రాలేదనే చెప్పాలి.

అందుకే దీనిని బాహుబలితో పోలుస్తుంటారు. టీవీ బాహుబలి అని పిలుస్తుంటారు. 2019లో ఈ సీరియల్​ ప్రసారమైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా సాహో ఉండేది. ఈ మూవీ బడ్జెట్ రూ. 350 కోట్లు. అంటే రామ్ సియా కే లవ్ కుష్ షో దీనికి డబుల్​ అన్న మాట.

ఇక రూ. 500 కోట్లతో తెరకెక్కిన ఆర్​ఆర్​ఆర్​, రూ.400 కోట్లతో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమాలు కూడా ఈ సీరియల్ బడ్జెట్‌ను టచ్ చేయలేకపోయాయి. 2023లో రామాయణం ఆధారంగా వచ్చిన ఆదిపురుష్ కూడా రూ. 550 కోట్లతోనే తెరకెక్కింది. సలార్​, ప్రాజెక్ట్ కె, పూష్ప 2 కూడా రూ.600కోట్లు దాటట్లేదు. అంటే రామ్ సియా కే లవ్ కుష్ కన్నా ఇవి తక్కువే. కాగా, ఈ టెలివిజన్ షో ఆగస్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు ప్రసారమైంది. మొత్తం 141 ఎపిసోడ్‌లు ఉన్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి - ఎరుపెక్కిన గోదావ‌రి - Gangs Of Godavari Review

అల్లు అర్జున్​ 'పుష్ప 2'కు పోటీగా దిగిన కీర్తిసురేశ్​ - Alluarjun VS Keerthi Suresh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.