ETV Bharat / business

దలాల్ స్ట్రీట్ ఢమాల్​- సెన్సెక్స్ 1062 పాయింట్లు డౌన్- రూ.6 లక్షల కోట్లు ఆవిరి - Stock Market End Today

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 3:58 PM IST

Updated : May 9, 2024, 4:49 PM IST

Stock Market Closing Today : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1062 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయాయి.

Stock Market
Stock Market (Source : Getty Images)

Stock Market Closing Today : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1062 పాయింట్లు నష్టపోయి 72,604 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 21,957 వద్ద ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.393 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ గురువారం ఉదయం 73,499.49 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా అలానే కొనసాగింది. ఇంట్రాడేలో 72,334.18 కనిష్ఠానికి చేరిన సూచీ చివరకు 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టపోయాయి. నిఫ్టీలో హీరో మోటాకార్ప్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లో ముగిశాయి. లార్సెన్‌, ఏషియన్‌ పేయింట్స్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ భారీ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర కాస్త పెరిగి 84.16 డాలర్లకు చేరింది.

కారణాలు ఇవే!

  • లోక్​సభ ఎన్నికల్లో మూడు దశల్లో పోలింగ్‌ పూర్తయిన వేళ ఓటింగ్ సరళిపై మదుపరుల్లో చిన్నపాటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు తగ్గింది. ముందుగా ఊహించినట్లు ఫలితం పూర్తిగా తలకిందులయ్యే అవకాశం లేనప్పటికీ, ఊహించినట్లుగా ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
  • సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఐటీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా సూచీలను పడేశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం కూడా సూచీలకు మరో దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు.
  • దేశీయంగా వెలువడుతున్న క్యూ4 ఫలితాలు కూడా మదుపరులను పెద్దగా మెప్పించడం లేదు. సమీప భవిష్యత్‌లో మార్కెట్‌ను అంచనా వేయడానికి కొలమానంగా భావించే వోలటాలిటీ ఇండెక్స్‌ ఇండియా- VIX గురువారం మరింత పెరిగి 18 శాతానికి చేరింది. దీంతో మదుపరులు అమ్మకాలకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

FY25 స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్​ - ఇన్వెస్టర్లకు లాభమా? నష్టమా? - Stock Market Forecast 2024 25

స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాలా? డివిడెండ్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయండిలా!

Stock Market Closing Today : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1062 పాయింట్లు నష్టపోయి 72,604 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 21,957 వద్ద ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.6 లక్షల కోట్లు క్షీణించి రూ.393 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ గురువారం ఉదయం 73,499.49 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై రోజంతా అలానే కొనసాగింది. ఇంట్రాడేలో 72,334.18 కనిష్ఠానికి చేరిన సూచీ చివరకు 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టపోయాయి. నిఫ్టీలో హీరో మోటాకార్ప్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లో ముగిశాయి. లార్సెన్‌, ఏషియన్‌ పేయింట్స్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐటీసీ, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, దివిస్‌ ల్యాబ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ భారీ నష్టాల్లో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర కాస్త పెరిగి 84.16 డాలర్లకు చేరింది.

కారణాలు ఇవే!

  • లోక్​సభ ఎన్నికల్లో మూడు దశల్లో పోలింగ్‌ పూర్తయిన వేళ ఓటింగ్ సరళిపై మదుపరుల్లో చిన్నపాటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు తగ్గింది. ముందుగా ఊహించినట్లు ఫలితం పూర్తిగా తలకిందులయ్యే అవకాశం లేనప్పటికీ, ఊహించినట్లుగా ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
  • సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఐటీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా సూచీలను పడేశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం కూడా సూచీలకు మరో దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు.
  • దేశీయంగా వెలువడుతున్న క్యూ4 ఫలితాలు కూడా మదుపరులను పెద్దగా మెప్పించడం లేదు. సమీప భవిష్యత్‌లో మార్కెట్‌ను అంచనా వేయడానికి కొలమానంగా భావించే వోలటాలిటీ ఇండెక్స్‌ ఇండియా- VIX గురువారం మరింత పెరిగి 18 శాతానికి చేరింది. దీంతో మదుపరులు అమ్మకాలకు దిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

FY25 స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్​ - ఇన్వెస్టర్లకు లాభమా? నష్టమా? - Stock Market Forecast 2024 25

స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాలా? డివిడెండ్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయండిలా!

Last Updated : May 9, 2024, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.