ETV Bharat / business

'ఆ పన్నుల పెంపుతో నిరాశ'- స్టాక్​ మార్కెట్లపై బడ్జెట్​ ఎఫెక్ట్ ఇలా! - Stock Market Close

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 4:52 PM IST

Stock Market Close July 23, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొని చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. మెటల్ స్టాక్స్ రాణించగా, టెలికాం ఇన్​ఫ్రా స్టాక్స్ బాగా నష్టపోయాయి. బడ్జెట్-2024 ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడడమే ఇందుకు కారణం.

share market today
stock market today (Getty Images)

Stock Market Close July 23, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. బడ్జెట్ 2024లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్​ ట్రేడింగ్​పై పన్ను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించడమే ఇందుకు కారణం.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 435 పాయింట్లు మేర నష్టపోయాయి. అయితే బడ్జెట్లో పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపులు ప్రకటించిన తరువాత, స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్​, ఎఫ్​ఎంసీజీ షేర్లు బాగా లాభపడ్డాయి.

చివరకు బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్​ : టైటాన్, ఐటీసీ, అదానీ పోర్ట్స్​, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​, హిందుస్థాన్ యూనిలివర్​, హెచ్​సీఎల్ టెక్​, సన్​ఫార్మా, టీసీఎస్​, కోటక్ బ్యాంక్​
  • నష్టపోయిన షేర్స్​ : ​ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్​, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఏసియన్ పెయింట్స్​, పవర్​గ్రిడ్​

మదుపరులపై ఎఫెక్ట్​
'మార్కెట్ల దృక్కోణంలో చూస్తే స్వల్పకాలిక మూలధ లాభాలపై (ఎస్​టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్​టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంచడం చాలా ప్రతికూలమైన అంశం. అయినప్పటికీ మదుపరులు ఈ విషయంలో కాస్త ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది' అని సిట్రస్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా అన్నారు.

బడ్జెట్ కేటాయింపులు
బడ్జెట్​లో నిర్మలా సీతారామన్​ మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపు, రానున్న 5 ఏళ్లలో ఉపాధి కల్పనకు రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. తమ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారి కోసం బాగానే నిధులు కేటాయించారు. దీనితో పాటు గ్రామీణాభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు ప్రకటించారు. దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రాజెక్టులపై రూ.11.11 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. దీనితో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని, ఫ్లాట్​గా ముగిశాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,444.06 కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్​ లాభాలతో ముగియగా, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టపోయాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లో మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.25 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.63 డాలర్లుగా ఉంది.

బడ్జెట్​లో రైతుల కోసం రూ.1.52 లక్షల కోట్లు - నేచురల్​ ఫార్మింగ్​పై ప్రత్యేక దృష్టి! - Agriculture Budget 2024

భారీగా ఉద్యోగాలు- ఐటీ శ్లాబుల్లో మార్పులు- బడ్జెట్​లో చెప్పిన గుడ్​న్యూస్​ లిస్ట్ ఇదే! - Budget 2024 Key Highlights

Stock Market Close July 23, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. బడ్జెట్ 2024లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్​ ట్రేడింగ్​పై పన్ను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించడమే ఇందుకు కారణం.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 435 పాయింట్లు మేర నష్టపోయాయి. అయితే బడ్జెట్లో పన్ను మినహాయింపులు, కస్టమ్స్ సుంకం తగ్గింపులు ప్రకటించిన తరువాత, స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్​, ఎఫ్​ఎంసీజీ షేర్లు బాగా లాభపడ్డాయి.

చివరకు బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 80,429 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 30 పాయింట్లు కోల్పోయి 24,479 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్​ : టైటాన్, ఐటీసీ, అదానీ పోర్ట్స్​, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​, హిందుస్థాన్ యూనిలివర్​, హెచ్​సీఎల్ టెక్​, సన్​ఫార్మా, టీసీఎస్​, కోటక్ బ్యాంక్​
  • నష్టపోయిన షేర్స్​ : ​ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్​, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఏసియన్ పెయింట్స్​, పవర్​గ్రిడ్​

మదుపరులపై ఎఫెక్ట్​
'మార్కెట్ల దృక్కోణంలో చూస్తే స్వల్పకాలిక మూలధ లాభాలపై (ఎస్​టీసీజీ) పన్ను 20 శాతానికి పెంచడం; దీర్ఘకాలిక మూలధన లాభాలపై (ఎల్​టీసీజీ) పన్ను 12.5 శాతానికి పెంచడం చాలా ప్రతికూలమైన అంశం. అయినప్పటికీ మదుపరులు ఈ విషయంలో కాస్త ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది' అని సిట్రస్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా అన్నారు.

బడ్జెట్ కేటాయింపులు
బడ్జెట్​లో నిర్మలా సీతారామన్​ మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను మినహాయింపు, రానున్న 5 ఏళ్లలో ఉపాధి కల్పనకు రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. తమ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారి కోసం బాగానే నిధులు కేటాయించారు. దీనితో పాటు గ్రామీణాభివృద్ధి కోసం రూ.2.66 లక్షల కోట్లు ప్రకటించారు. దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రాజెక్టులపై రూ.11.11 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. దీనితో మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని, ఫ్లాట్​గా ముగిశాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,444.06 కోట్లు విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

అంతర్జాతీయ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్​ లాభాలతో ముగియగా, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టపోయాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లో మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.25 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.63 డాలర్లుగా ఉంది.

బడ్జెట్​లో రైతుల కోసం రూ.1.52 లక్షల కోట్లు - నేచురల్​ ఫార్మింగ్​పై ప్రత్యేక దృష్టి! - Agriculture Budget 2024

భారీగా ఉద్యోగాలు- ఐటీ శ్లాబుల్లో మార్పులు- బడ్జెట్​లో చెప్పిన గుడ్​న్యూస్​ లిస్ట్ ఇదే! - Budget 2024 Key Highlights

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.