ETV Bharat / business

'2024లో భారత్​ వృద్ధి రేటు 6.8%' - S&P రేటింగ్స్ అంచనా!​ - India Growth Forecast

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

S&P India's Growth Forecast : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను యథాతథంగా కొనసాగించింది అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్​. అలాగే అక్టోబరులో జరిగే ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

S&P
S&P (ANI)

S&P India's Growth Forecast : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత్ 6.8 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్​ (ఎస్&పీ) స్పష్టం చేసింది. అక్టోబరులో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తన తాజా ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ అవుట్​లుక్​లో ఈ మేరకు ఎస్&పీ పేర్కొంది.

'వడ్డీ రేట్లపై ఆర్​బీఐ నిర్ణయం'
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం వద్దే ఉంచింది ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్. భారతదేశంలో పటిష్ఠమైన వృద్ధిరేటు రిజర్వ్ బ్యాంక్ తన లక్ష్యాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. "భారత్​లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనా 6.8 శాతం. ఆర్​బీఐ అక్టోబర్​లో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని మేము భావిస్తున్నాం. ఆర్​బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా పరిగణిస్తోంది. ఆహార ధరల పెరుగుదల తగ్గితే తప్ప, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించడం చాలా కష్టమని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుంది" అని ఎస్ అండ్ పీ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో(2023-24) భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందిందని రేటింగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లో ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణకు కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలపై ఎక్కువ బడ్జెట్​ను కేటాయించిందని పేర్కొంది. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేంద్రం బడ్జెట్​లో కేటాయించిందని వెల్లడించింది.

కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశం!
ఆర్​బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష అక్టోబర్ 7-9 వరకు జరగనుంది. ఈ సమీక్షలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్​బీఐ 2023 ఫిబ్రవరి నుంచి బెంచ్​మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతోంది. అయితే, ఇటీవలే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్​బీఐ కూడా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చని అంచనాలు ఉన్నాయి.

S&P India's Growth Forecast : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత్ 6.8 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్​ (ఎస్&పీ) స్పష్టం చేసింది. అక్టోబరులో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తన తాజా ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ అవుట్​లుక్​లో ఈ మేరకు ఎస్&పీ పేర్కొంది.

'వడ్డీ రేట్లపై ఆర్​బీఐ నిర్ణయం'
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం వద్దే ఉంచింది ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్. భారతదేశంలో పటిష్ఠమైన వృద్ధిరేటు రిజర్వ్ బ్యాంక్ తన లక్ష్యాలకు అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. "భారత్​లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనా 6.8 శాతం. ఆర్​బీఐ అక్టోబర్​లో వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని మేము భావిస్తున్నాం. ఆర్​బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని వడ్డీ రేట్ల తగ్గింపునకు అడ్డంకిగా పరిగణిస్తోంది. ఆహార ధరల పెరుగుదల తగ్గితే తప్ప, ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించడం చాలా కష్టమని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుంది" అని ఎస్ అండ్ పీ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో(2023-24) భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందిందని రేటింగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లో ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణకు కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలపై ఎక్కువ బడ్జెట్​ను కేటాయించిందని పేర్కొంది. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని కేంద్రం బడ్జెట్​లో కేటాయించిందని వెల్లడించింది.

కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశం!
ఆర్​బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్ష అక్టోబర్ 7-9 వరకు జరగనుంది. ఈ సమీక్షలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్​బీఐ 2023 ఫిబ్రవరి నుంచి బెంచ్​మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతోంది. అయితే, ఇటీవలే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్​బీఐ కూడా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చని అంచనాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.