ETV Bharat / business

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం - EMI భారం యథాతథం - RBI Monetary Policy June 2024

RBI Monetary Policy June 2024 : రిజర్వ్​ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 10:06 AM IST

RBI MPC June 2024
RBI Monetary Policy (ANI)

RBI Monetary Policy June 2024 : కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.

వాస్తవానికి 2023 ఏప్రిల్​ నుంచి రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ ప్రకటించిన రెండో ద్వైమాసిక పరపతి విధానం ఇది.

జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండవచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. ఇది కనుక కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగే ఏడాది కూడా 7 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు అవుతుంది. మరోవైపు సీపీఐ ద్రవ్యోల్బణాన్ని ఇరువైపులా 2 శాతం మార్జిన్​తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ఆర్​బీఐని ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు

  • ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్​బీఐ కట్టుబడి ఉందని, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
  • 'నైరుతి రుతుపవనాల వల్ల ఖరీఫ్ సీజన్​లో పంటల ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావిస్తున్నామని' శక్తికాంత దాస్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు

  • రిటైల్ ద్రవ్యోల్బణం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది.
  • 'అనుకున్నట్లుగా సకాలంలో మంచి వర్షాలు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని' ఆర్​బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కొంత మేరకు దిద్దుబాటు జరగవచ్చని శక్తికాంత దాస్ అన్నారు.

దృఢమైన ఆర్థిక పునాదులతో భారత్​

  • ఇతర కరెన్సీలతో పోల్చితే ఇండియన్ రూపాయి సాపేక్ష స్థిరత్వంతో కొనసాగుతోంది. ఇది మన దేశ బలమైన ఆర్థిక మూలాలకు నిదర్శనంగా ఉందని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.
  • 2024 ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో సూచిస్తున్నాయి.
  • 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యవసర రిస్క్ బఫర్​ (నిల్వలను) 0.5 శాతం పెంచడం వల్ల ఆర్​బీఐ బ్యాలెన్స్ షీట్ మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్​ అన్నారు.

కస్టమర్ల రక్షణకే మొదటి ప్రాధాన్యత!

  • 'వినియోగదారుల రక్షణకే ఆర్​బీఐ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికీ సరైన పారదర్శక విధానాలు పాటించకుండా కొన్ని రకాల రుసుములు వసూలు చేస్తున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే అసురక్షిత రుణాలు, అడ్వాన్స్​లను తగ్గించడానికి చేయడానికి చర్యలు తీసుకుంటాం' అని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.

పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు!

  • 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి కరెంట్​ ఖాతా లోటు మోడరేట్ అవుతుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
  • ప్రపంచ రెమిటెన్స్​ల్లో భారతదేశం వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని అతిపెద్ద దేశంగా ఇండియా కొనసాగుతోందని శక్తికాంత దాస్ తెలిపారు.
  • 2024 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నప్పటికీ, నికర విదేశీ పెట్టుబడులు కాస్త మితంగానే ఉన్నాయి.

ఫెమా నిబంధనలు హేతుబద్ధీకరించాల్సిందే!

  • వస్తు, సేవల ఎగుమతి, దిగుముతులకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్ యాక్ట్​ మార్గదర్శకాలను హేతుబద్ధీకరించాల్సి ఉందని శక్తికాంత దాస్​ అన్నారు.

ఇకపై రూ.3 కోట్ల వరకు!
మన దేశంలో ఇప్పటి వరకు బ్యాంకుల్లో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.3 కోట్లకు పెంచుతూ ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌లో తప్పులు చేశారా? అయితే సరిదిద్దుకోండిలా! చివరి తేది ఇదే! - Revised ITR Filing

EPF అకౌంట్​లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction

RBI Monetary Policy June 2024 : కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.

వాస్తవానికి 2023 ఏప్రిల్​ నుంచి రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్​బీఐ ప్రకటించిన రెండో ద్వైమాసిక పరపతి విధానం ఇది.

జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం ఉండవచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. ఇది కనుక కార్యరూపం దాల్చితే వరుసగా నాలుగే ఏడాది కూడా 7 శాతానికి పైగా వృద్ధి సాధించినట్లు అవుతుంది. మరోవైపు సీపీఐ ద్రవ్యోల్బణాన్ని ఇరువైపులా 2 శాతం మార్జిన్​తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ఆర్​బీఐని ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు

  • ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య మంచి సమతుల్యత కొనసాగుతోందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచడానికి ఆర్​బీఐ కట్టుబడి ఉందని, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
  • 'నైరుతి రుతుపవనాల వల్ల ఖరీఫ్ సీజన్​లో పంటల ఉత్పత్తి పెరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే దీని వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతాయని భావిస్తున్నామని' శక్తికాంత దాస్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు

  • రిటైల్ ద్రవ్యోల్బణం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 4.9 శాతం, రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.6 శాతం, నాల్గో త్రైమాసికంలో 4.5 శాతం ఉండొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది.
  • 'అనుకున్నట్లుగా సకాలంలో మంచి వర్షాలు పడితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చు. ఒకవేళ ఇలా జరగకపోతే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని' ఆర్​బీఐ గవర్నర్ పేర్కొన్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కొంత మేరకు దిద్దుబాటు జరగవచ్చని శక్తికాంత దాస్ అన్నారు.

దృఢమైన ఆర్థిక పునాదులతో భారత్​

  • ఇతర కరెన్సీలతో పోల్చితే ఇండియన్ రూపాయి సాపేక్ష స్థిరత్వంతో కొనసాగుతోంది. ఇది మన దేశ బలమైన ఆర్థిక మూలాలకు నిదర్శనంగా ఉందని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.
  • 2024 ఆర్థిక సంవత్సర వార్షిక ఫలితాలు మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో సూచిస్తున్నాయి.
  • 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యవసర రిస్క్ బఫర్​ (నిల్వలను) 0.5 శాతం పెంచడం వల్ల ఆర్​బీఐ బ్యాలెన్స్ షీట్ మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్​ అన్నారు.

కస్టమర్ల రక్షణకే మొదటి ప్రాధాన్యత!

  • 'వినియోగదారుల రక్షణకే ఆర్​బీఐ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని సంస్థలు ఇప్పటికీ సరైన పారదర్శక విధానాలు పాటించకుండా కొన్ని రకాల రుసుములు వసూలు చేస్తున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే అసురక్షిత రుణాలు, అడ్వాన్స్​లను తగ్గించడానికి చేయడానికి చర్యలు తీసుకుంటాం' అని శక్తికాంత దాస్​ పేర్కొన్నారు.

పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు!

  • 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి కరెంట్​ ఖాతా లోటు మోడరేట్ అవుతుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
  • ప్రపంచ రెమిటెన్స్​ల్లో భారతదేశం వాటా 15.2 శాతం. తద్వారా విదేశీ ద్రవ్యాన్ని అతిపెద్ద దేశంగా ఇండియా కొనసాగుతోందని శక్తికాంత దాస్ తెలిపారు.
  • 2024 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నప్పటికీ, నికర విదేశీ పెట్టుబడులు కాస్త మితంగానే ఉన్నాయి.

ఫెమా నిబంధనలు హేతుబద్ధీకరించాల్సిందే!

  • వస్తు, సేవల ఎగుమతి, దిగుముతులకు సంబంధించిన ఫారిన్ ఎక్స్ఛేంజ్​ మేనేజ్​మెంట్ యాక్ట్​ మార్గదర్శకాలను హేతుబద్ధీకరించాల్సి ఉందని శక్తికాంత దాస్​ అన్నారు.

ఇకపై రూ.3 కోట్ల వరకు!
మన దేశంలో ఇప్పటి వరకు బ్యాంకుల్లో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.3 కోట్లకు పెంచుతూ ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌లో తప్పులు చేశారా? అయితే సరిదిద్దుకోండిలా! చివరి తేది ఇదే! - Revised ITR Filing

EPF అకౌంట్​లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.