ETV Bharat / bharat

అక్రమ కట్టడాలు, మైనింగ్‌వల్లే వయనాడ్‌ ఘోరం! - Wayanad Landslides Causes

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 7:17 AM IST

Wayanad Landslides Causes : వయనాడ్ విపత్తుకు అక్రమ కట్టడాలు, మైనింగ్​లే కారణమని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అభిప్రాయపడ్డారు. హిమాలయాల మాదిరిగానే పశ్చిమ కనుమలు కూడా పెళుసుగా ఉండే ప్రాంతాలని ఆయన​ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

Wayanad Landslides Causes
Wayanad landslides (AP)

Wayanad Landslides Causes : అక్రమ కట్టడాలు, మైనింగ్‌వల్లే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర విపత్తు చోటుచేసుకుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై రాష్ట్రాలతో చర్చిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత జోన్‌గా ప్రకటించేందుకు 2014 నుంచి జులై 31 వరకూ ఆరు ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశామని తెలిపారు. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో తుది నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఈ మధ్యలోనే కేరళలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీని వల్లనే వయనాడ్‌ ఘోరం చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు.

హిమాలయాల మాదిరిగానే పశ్చిమ కనుమలు కూడా పెళుసుగా ఉండే ప్రాంతాలని భూపేంద్ర యాదవ్​ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ఒకే కుటుంబంలోని 11 మంది మృతి

  • నౌఫాల్‌ అనే ఇంటి యజమాని 11 మంది కుటుంబ సభ్యులను వదిలి ఒమన్‌ వెళ్లారు. 3 నెలలు తిరక్కుండానే ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. వయనాడ్‌ ప్రకృతి విపత్తు కారణంగా ఆయన కుటుంబంలోని 11 మంది కూడా మరణించారు. తన తల్లిదండ్రులు భార్య, పిల్లలు, సోదరుడు, మరదలు, వారి పిల్లలను ఆయన కోల్పోయారు.
  • కేరళలో ప్రకృతి విలయంలో మృతిచెందినవారి సంఖ్య 222కు చేరుకుంది. 31 గుర్తు తెలియని మృతదేహాలకు సోమవారం అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.

బాధితుల కోసం విరాళాలు

  • వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ స్వయంగా రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇచ్చారు. ముందుకొచ్చారు. అంతేకాదు టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులను పరామర్శించారు.
  • కేరళలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ వయనాడ్​ బాధితుల కోసం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.
  • కేరళలోని వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా ముందుకొచ్చారు. వీరిద్దరూ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.1 కోటి విరాళం ఇచ్చారు. వీరితోపాటు పలువురు సినీనటులు కూడా భారీ ఎత్తున విరాళాలు ప్రకటించి, సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చారు.

'సెప్టెంబరులో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు' - కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి - JK Assembly Elections In September

బంగ్లాదేశ్​ పరిణామాలపై భారత్​ హైఅలర్ట్​- మోదీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్- హసీనాతో NSA భేటీ! - CCS Meeting

Wayanad Landslides Causes : అక్రమ కట్టడాలు, మైనింగ్‌వల్లే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర విపత్తు చోటుచేసుకుందని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియపై రాష్ట్రాలతో చర్చిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. పశ్చిమ కనుమల్లోని 56,800 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత జోన్‌గా ప్రకటించేందుకు 2014 నుంచి జులై 31 వరకూ ఆరు ముసాయిదా నోటిఫికేషన్లను జారీ చేశామని తెలిపారు. కానీ రాష్ట్రాల అభ్యంతరాలతో తుది నోటిఫికేషన్‌ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఈ మధ్యలోనే కేరళలో అక్రమ నిర్మాణాలకు, మైనింగ్‌కు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. దీని వల్లనే వయనాడ్‌ ఘోరం చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు.

హిమాలయాల మాదిరిగానే పశ్చిమ కనుమలు కూడా పెళుసుగా ఉండే ప్రాంతాలని భూపేంద్ర యాదవ్​ తెలిపారు. ఈ ప్రాంతాల్లో విపత్తులను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ఒకే కుటుంబంలోని 11 మంది మృతి

  • నౌఫాల్‌ అనే ఇంటి యజమాని 11 మంది కుటుంబ సభ్యులను వదిలి ఒమన్‌ వెళ్లారు. 3 నెలలు తిరక్కుండానే ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. వయనాడ్‌ ప్రకృతి విపత్తు కారణంగా ఆయన కుటుంబంలోని 11 మంది కూడా మరణించారు. తన తల్లిదండ్రులు భార్య, పిల్లలు, సోదరుడు, మరదలు, వారి పిల్లలను ఆయన కోల్పోయారు.
  • కేరళలో ప్రకృతి విలయంలో మృతిచెందినవారి సంఖ్య 222కు చేరుకుంది. 31 గుర్తు తెలియని మృతదేహాలకు సోమవారం అధికారులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.

బాధితుల కోసం విరాళాలు

  • వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ స్వయంగా రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇచ్చారు. ముందుకొచ్చారు. అంతేకాదు టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులను పరామర్శించారు.
  • కేరళలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ వయనాడ్​ బాధితుల కోసం రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.
  • కేరళలోని వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా ముందుకొచ్చారు. వీరిద్దరూ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.1 కోటి విరాళం ఇచ్చారు. వీరితోపాటు పలువురు సినీనటులు కూడా భారీ ఎత్తున విరాళాలు ప్రకటించి, సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చారు.

'సెప్టెంబరులో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు' - కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి - JK Assembly Elections In September

బంగ్లాదేశ్​ పరిణామాలపై భారత్​ హైఅలర్ట్​- మోదీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్- హసీనాతో NSA భేటీ! - CCS Meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.