ETV Bharat / bharat

కొత్తగా గెలిచిన ఎంపీలు వెంటనే ఆ పని చేయాలట! - lok sabha election results 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 3:15 PM IST

Updated : Jun 4, 2024, 3:40 PM IST

Registration For New MPs : 18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికయ్యే సభ్యుల రిజిస్ట్రేషన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేసింది లోక్ సభ సెక్రటేరియట్. ఈ కౌంటర్లు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో జూన్ 5-14వరకు ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 8వరకు పనిచేస్తాయని పేర్కొంది.

Registration For New MPs
Registration For New MPs (GettyImages)

Registration For New MPs : దిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్​లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎంపీల రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లు జూన్ 5-14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని లోక్​సభ సెక్రటేరియట్ తెలిపింది. పేపర్ వినియోగాన్ని తగ్గించడం, ఎంపీలకు వసతులను అందించేందుకు ఆన్​లైన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్​వేర్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఫిజికల్ ఫారంపై సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఇలా డిజిటలైజ్డ్​ రిజిస్ట్రేషన్ వల్ల సమయం ఆదా కానుంది.

గతంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాత పార్లమెంట్‌ భవనంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేవారు. ఈ దఫా రిజిస్ట్రేషన్‌ ఏర్పాట్లను పార్లమెంట్‌ హౌస్‌ ఎనెక్స్​లో ఏర్పాటు చేసింది లోక్​సభ సెక్రటేరియట్. ఎన్నికల కమిషన్‌ వెబ్​సైట్​ను పరిశీలించి విజేతలైన అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. సాఫ్ట్​వేర్ అప్లికేషన్ ద్వారా ఈ బృందం గెలిచిన ఎంపీ కొత్తగా ఎన్నికయ్యారా లేదంటే అంతకుముందు ఎన్నికల్లో విజయం సాధించారా అని చెక్ చేస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అధికారిక నివాసాలు కేటాయించే వరకు వెస్ట్రన్‌ కోర్టులో వసతి కల్పించనున్నారు. కొత్త ఎంపీల వసతి ఏర్పాట్లకు అవసరమైతే రాష్ట్ర భవనాలనూ కేటాయించే అవకాశం ఉంది.

ఎన్​డీఏ వర్సెస్ ఇండియా కూటమి హోరాహోరీ
ఈ లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ సీట్లను తగ్గించగలిగింది. ఉత్తర్​ప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ భారీగా సీట్లను చేజార్చుకుంది. ఒడిశాలో మాత్రం బీజేపీ అధికార బీజేడీని తీవ్రంగా దెబ్బకొట్టి రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. దిల్లీలో మరోసారి కమలం పార్టీ తన సత్తాను చాటింది. ఆప్ పంజాబ్​లో మినహా మరెక్కడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలాగే అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్​ప్రదేశ్ లో అదరగొట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్​లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Registration For New MPs : దిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్​లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా గెలిచిన ఎంపీల రిజిస్ట్రేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లు జూన్ 5-14వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని లోక్​సభ సెక్రటేరియట్ తెలిపింది. పేపర్ వినియోగాన్ని తగ్గించడం, ఎంపీలకు వసతులను అందించేందుకు ఆన్​లైన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్​వేర్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఫిజికల్ ఫారంపై సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఇలా డిజిటలైజ్డ్​ రిజిస్ట్రేషన్ వల్ల సమయం ఆదా కానుంది.

గతంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాత పార్లమెంట్‌ భవనంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేవారు. ఈ దఫా రిజిస్ట్రేషన్‌ ఏర్పాట్లను పార్లమెంట్‌ హౌస్‌ ఎనెక్స్​లో ఏర్పాటు చేసింది లోక్​సభ సెక్రటేరియట్. ఎన్నికల కమిషన్‌ వెబ్​సైట్​ను పరిశీలించి విజేతలైన అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. సాఫ్ట్​వేర్ అప్లికేషన్ ద్వారా ఈ బృందం గెలిచిన ఎంపీ కొత్తగా ఎన్నికయ్యారా లేదంటే అంతకుముందు ఎన్నికల్లో విజయం సాధించారా అని చెక్ చేస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అధికారిక నివాసాలు కేటాయించే వరకు వెస్ట్రన్‌ కోర్టులో వసతి కల్పించనున్నారు. కొత్త ఎంపీల వసతి ఏర్పాట్లకు అవసరమైతే రాష్ట్ర భవనాలనూ కేటాయించే అవకాశం ఉంది.

ఎన్​డీఏ వర్సెస్ ఇండియా కూటమి హోరాహోరీ
ఈ లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ సీట్లను తగ్గించగలిగింది. ఉత్తర్​ప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ భారీగా సీట్లను చేజార్చుకుంది. ఒడిశాలో మాత్రం బీజేపీ అధికార బీజేడీని తీవ్రంగా దెబ్బకొట్టి రాష్ట్రంలో అధిక ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. దిల్లీలో మరోసారి కమలం పార్టీ తన సత్తాను చాటింది. ఆప్ పంజాబ్​లో మినహా మరెక్కడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలాగే అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఉత్తర్​ప్రదేశ్ లో అదరగొట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్​లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

రాయల్​ ఫ్యామిలీ కంచుకోట బద్దల్​- మండిలో కంగనా రనౌత్ గ్రాండ్ విక్టరీ

కొత్తగా గెలిచిన ఎంపీలు వెంటనే ఆ పని చేయాలట! - lok sabha election results 2024

Last Updated : Jun 4, 2024, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.