ETV Bharat / bharat

రైతులకు RBI గుడ్​న్యూస్- ఇకపై తాకట్టు లేకుండా రూ.2లక్షల లోన్! - RBI RAISES COLLATERAL

తాకట్టు లేని రుణ పరిమితి పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలు

RBI Raises Collateral Free Agricultural Loan Limit
RBI Raises Collateral Free Agricultural Loan Limit (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2024, 6:19 PM IST

Updated : Dec 14, 2024, 7:46 PM IST

RBI Raises Collateral Free Agricultural Loan Limit : వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే లోన్ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని ఇటీవల రూ.2 లక్షలకు పెంచింది ప్రభుత్వం. 2025 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

పంటల సాగు కోసం అన్నదాతలు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో కేవలం రూ.10 వేలే ఉండగా, క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా దీన్ని రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం- సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నారు అన్నదాతలు. అలాంటివారికి అండగా ఉండేందుకు ఆర్​బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది.

వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చర్య ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలుచేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు మంత్రిత్వ శాఖ సూచించింది. వ్యవసాయ రంగంలో రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, వారికి అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు ఇదొక వ్యూహాత్మక చర్యగా అభివర్ణించింది.

రుణం ఏ ప్రయోజనం కోసం అందిస్తారు?

  • రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు లోన్‌ ఇస్తారు.
  • కూరగాయలు, పండ్లను పండించడానికి కూడా లోన్ అందిస్తారు.
  • పాలు, గుడ్లు, మాంసం, ఉన్ని కోసం పశుపోషణ చేయాలనుకుంటే కూడా రుణం ఇస్తారు.
  • రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు నిర్మించుకునేందుకు లోన్స్‌ తీసుకోవచ్చు.

RBI Raises Collateral Free Agricultural Loan Limit : వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే లోన్ సదుపాయాన్ని పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. దాన్ని ఇటీవల రూ.2 లక్షలకు పెంచింది ప్రభుత్వం. 2025 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

పంటల సాగు కోసం అన్నదాతలు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్‌బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో కేవలం రూ.10 వేలే ఉండగా, క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా దీన్ని రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం- సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నారు అన్నదాతలు. అలాంటివారికి అండగా ఉండేందుకు ఆర్​బీఐ ఈ సదుపాయం కల్పిస్తోంది.

వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చర్య ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వేగంగా అమలుచేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకులకు మంత్రిత్వ శాఖ సూచించింది. వ్యవసాయ రంగంలో రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, వారికి అవసరమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు ఇదొక వ్యూహాత్మక చర్యగా అభివర్ణించింది.

రుణం ఏ ప్రయోజనం కోసం అందిస్తారు?

  • రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు లోన్‌ ఇస్తారు.
  • కూరగాయలు, పండ్లను పండించడానికి కూడా లోన్ అందిస్తారు.
  • పాలు, గుడ్లు, మాంసం, ఉన్ని కోసం పశుపోషణ చేయాలనుకుంటే కూడా రుణం ఇస్తారు.
  • రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు నిర్మించుకునేందుకు లోన్స్‌ తీసుకోవచ్చు.
Last Updated : Dec 14, 2024, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.