ETV Bharat / bharat

'లేటరల్‌ ఎంట్రీ పేరుతో - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ హరిస్తోంది' - రాహుల్ గాంధీ - Rahul Gandhi On Lateral Entry

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 3:07 PM IST

Rahul Gandhi On Lateral Entry : లేటరల్‌ ఎంట్రీ పేరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ హరిస్తోందని రాహుల్ గాంధీ మండి పడ్డారు. వీరికి చెందాల్సిన ఉన్నత స్థాయి ఉద్యోగాలను ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు ఇస్తోందని ఆరోపించారు.

Lateral Entry
Lateral Entry (ANI)

Rahul Gandhi On Lateral Entry : లేటరల్‌ ఎంట్రీ పేరుతో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను బీజేపీ లాక్కుంటోందని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఆరోపించారు. ఉన్నతోద్యోగాలను దొడ్డిదోవన ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీ రామరాజ్యం పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు.

"బీజేపీ రామరాజ్యం పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దళితులు, ఓబీసీలు, ఆదివాసీల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని చూస్తోంది" - రాహుల్ గాంధీ, లోక్​సభలో ప్రధాన ప్రతిపక్ష నేత

కాంగ్రెస్​ది ద్వంద్వ వైఖరి
రాహుల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ లేటరల్ ఎంట్రీ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ప్రత్యారోపణలు చేశారు. లేటరల్‌ ఎంట్రీ నియామకాల్లో పాటించే నిబంధనలను ఉటంకించారు. ఈ విధానంలోనూ రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలంటూ 2020లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ మెమోను కూడా ఆయన పోస్టు చేశారు.

"ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్‌ ఎంట్రీపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నాయి. ఈ విధానాన్ని తీసుకొచ్చింది గత యూపీఏ ప్రభుత్వమే. 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించిన రెండో ఎస్సార్సీ సైతం ఈ విధానాన్ని బలంగా సమర్థించింది. దాన్ని అమలు చేసేందుకు ఎన్‌డీయే ప్రభుత్వం పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది" అని అశ్వినీ వైష్ణవ్​ అన్నారు.

రాహుల్‌ గాంధీ 'లేటరల్ ఎంట్రీ'పై చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే చెలరేగుతోంది. లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉపకార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. దీన్ని రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. ఇది జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను బీజేపీ లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. ఉన్నతస్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం లేదని, దీన్ని మెరుగుపరిచే బదులు, లేటరల్‌ ఎంట్రీ ద్వారా ఆర్​ఎస్​ఎస్ కార్యకర్తలకు ఆ పదవులను కట్టబెట్టాలని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కానీ ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని బీజేపీ అంటోంది.

మెడికో హత్యాచారం ఘటనపై భారీ ర్యాలీ- ఏకతాటిపైకి చిరకాల ప్రత్యర్థులు- రంగంలోకి పోలీసులు! - Kolkata Doctor Case

పార్టీలో ఎన్నో అవమానాలు- ఎవరు తోడుగా వస్తే వారితో వెళ్తా: చంపయీ - Champai Soren Letter

Rahul Gandhi On Lateral Entry : లేటరల్‌ ఎంట్రీ పేరుతో దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను బీజేపీ లాక్కుంటోందని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ ఆరోపించారు. ఉన్నతోద్యోగాలను దొడ్డిదోవన ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీ రామరాజ్యం పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు.

"బీజేపీ రామరాజ్యం పేరుతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దళితులు, ఓబీసీలు, ఆదివాసీల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని చూస్తోంది" - రాహుల్ గాంధీ, లోక్​సభలో ప్రధాన ప్రతిపక్ష నేత

కాంగ్రెస్​ది ద్వంద్వ వైఖరి
రాహుల్ ఆరోపణలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ లేటరల్ ఎంట్రీ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ప్రత్యారోపణలు చేశారు. లేటరల్‌ ఎంట్రీ నియామకాల్లో పాటించే నిబంధనలను ఉటంకించారు. ఈ విధానంలోనూ రిజర్వేషన్లను కచ్చితంగా పాటించాలంటూ 2020లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఓ మెమోను కూడా ఆయన పోస్టు చేశారు.

"ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్‌ ఎంట్రీపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలు ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నాయి. ఈ విధానాన్ని తీసుకొచ్చింది గత యూపీఏ ప్రభుత్వమే. 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించిన రెండో ఎస్సార్సీ సైతం ఈ విధానాన్ని బలంగా సమర్థించింది. దాన్ని అమలు చేసేందుకు ఎన్‌డీయే ప్రభుత్వం పారదర్శక విధానాన్ని తీసుకొచ్చింది" అని అశ్వినీ వైష్ణవ్​ అన్నారు.

రాహుల్‌ గాంధీ 'లేటరల్ ఎంట్రీ'పై చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే చెలరేగుతోంది. లేటరల్‌ ఎంట్రీ పద్ధతిలో 45 మంది సంయుక్త కార్యదర్శులు, ఉపకార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి యూపీఎస్సీ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. దీన్ని రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. ఇది జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను బీజేపీ లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. ఉన్నతస్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కడం లేదని, దీన్ని మెరుగుపరిచే బదులు, లేటరల్‌ ఎంట్రీ ద్వారా ఆర్​ఎస్​ఎస్ కార్యకర్తలకు ఆ పదవులను కట్టబెట్టాలని చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఈ విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, కానీ ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని బీజేపీ అంటోంది.

మెడికో హత్యాచారం ఘటనపై భారీ ర్యాలీ- ఏకతాటిపైకి చిరకాల ప్రత్యర్థులు- రంగంలోకి పోలీసులు! - Kolkata Doctor Case

పార్టీలో ఎన్నో అవమానాలు- ఎవరు తోడుగా వస్తే వారితో వెళ్తా: చంపయీ - Champai Soren Letter

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.