ETV Bharat / bharat

'చరిత్ర నుంచి పాకిస్థాన్​ గుణపాఠం నేర్చుకోలేదు'- కార్గిల్​ గడ్డ నుంచి పాక్​కు మోదీ స్ట్రాంగ్​ వార్నింగ్​ - PM Modi Warning To Pakistan

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 11:44 AM IST

Updated : Jul 26, 2024, 12:41 PM IST

PM Modi Warning To Pakistan : దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు భారత్‌ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ సందర్భంగా కార్గిల్​లోని ద్రాస్​లోని వార్​ మెమోరియల్​ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్​ను ప్రధాని మోదీ హెచ్చరించారు.

PM Modi Warning To Pakistan
PM Modi Warning To Pakistan (ANI)

PM Modi Warning To Pakistan : చరిత్ర నుంచి పాకిస్థాన్​ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆనాటి యుద్ధంలో అమరులు అయిన కుటుంబాలతో ప్రధాని ముచ్చటించారు. తర్వాత షిన్‌కున్‌ లా సొరంగ పనుల ప్రాజక్టును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శమన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు. శాంతి కోసం భారత్ తపిస్తే పాకిస్థాన్‌ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు. కార్గిల్‌లో యుద్ధం మాత్రమే గెలవలేదని భారత్‌ సత్తా, సామర్థ్యాన్ని చాటామని చెప్పారు.

"ఈరోజు గొప్ప భూమి అయిన లద్దాఖ్‌ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 25వ వార్షికోత్సవానికి సాక్షిగా నిలుస్తుంది. పాకిస్థాన్ గతంలో చేసిన అన్ని వికృత ప్రయత్నాల్లోనూ విఫలమైంది. కానీ, చరిత్ర నుంచి పాకిస్థాన్‌ ఏమీ నేర్చుకోలేదు. ఉగ్రవాదం, ప్రత్యక్ష యుద్ధం సాయంతో నిలదొక్కుకోవడానికి చూస్తోంది. ఈ ఉగ్రవాద పోషకులకు వారి దుర్మార్గపు చర్యలు ఎప్పటికీ ఫలించవని నేను చెప్పాలనుకుంటున్నాను. మన సైనికులు తీవ్రవాదాన్ని పూర్తి శక్తితో అణిచివేస్తారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"గతంలో పాకిస్థాన్‌ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా, చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా! ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ రోజు నేను మాట్లాడే మాటలు ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ) నేరుగా వినబడతాయి. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి శత్రువులకు తగిన జవాబిస్తాయి" అని మోదీ పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అగ్నిపథ్‌ విమర్శలపై ప్రతిపక్షాలకు కౌంటర్‌
మరోవైపు అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఆయన, దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని చెప్పారు.

కార్గిల్‌ వీరులకు ప్రధాని మోదీ నివాళులు- రాజ్‌నాథ్‌, త్రివిధ దళాల పుష్పాంజలి - kargil vijay diwas 2024

55మంది ఉగ్రవాదులను చంపడమే టార్గెట్- ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 స్టార్ట్ - Operation Sarp Vinash 2024

PM Modi Warning To Pakistan : చరిత్ర నుంచి పాకిస్థాన్​ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. కార్గిల్‌ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆనాటి యుద్ధంలో అమరులు అయిన కుటుంబాలతో ప్రధాని ముచ్చటించారు. తర్వాత షిన్‌కున్‌ లా సొరంగ పనుల ప్రాజక్టును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శమన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని ప్రధాని అన్నారు. శాంతి కోసం భారత్ తపిస్తే పాకిస్థాన్‌ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు. కార్గిల్‌లో యుద్ధం మాత్రమే గెలవలేదని భారత్‌ సత్తా, సామర్థ్యాన్ని చాటామని చెప్పారు.

"ఈరోజు గొప్ప భూమి అయిన లద్దాఖ్‌ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ 25వ వార్షికోత్సవానికి సాక్షిగా నిలుస్తుంది. పాకిస్థాన్ గతంలో చేసిన అన్ని వికృత ప్రయత్నాల్లోనూ విఫలమైంది. కానీ, చరిత్ర నుంచి పాకిస్థాన్‌ ఏమీ నేర్చుకోలేదు. ఉగ్రవాదం, ప్రత్యక్ష యుద్ధం సాయంతో నిలదొక్కుకోవడానికి చూస్తోంది. ఈ ఉగ్రవాద పోషకులకు వారి దుర్మార్గపు చర్యలు ఎప్పటికీ ఫలించవని నేను చెప్పాలనుకుంటున్నాను. మన సైనికులు తీవ్రవాదాన్ని పూర్తి శక్తితో అణిచివేస్తారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

"గతంలో పాకిస్థాన్‌ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా, చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా! ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ రోజు నేను మాట్లాడే మాటలు ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ) నేరుగా వినబడతాయి. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి శత్రువులకు తగిన జవాబిస్తాయి" అని మోదీ పాక్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

అగ్నిపథ్‌ విమర్శలపై ప్రతిపక్షాలకు కౌంటర్‌
మరోవైపు అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకాన్ని సమర్థిస్తూ మాట్లాడిన ఆయన, దేశ సైన్యాన్ని ఆధునికీకరించడానికి, బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణ అని చెప్పారు.

కార్గిల్‌ వీరులకు ప్రధాని మోదీ నివాళులు- రాజ్‌నాథ్‌, త్రివిధ దళాల పుష్పాంజలి - kargil vijay diwas 2024

55మంది ఉగ్రవాదులను చంపడమే టార్గెట్- ఆపరేషన్‌ సర్ప్‌ వినాశ్ 2.0 స్టార్ట్ - Operation Sarp Vinash 2024

Last Updated : Jul 26, 2024, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.