ETV Bharat / bharat

మణిపుర్ సీఎం కాన్వాయ్​పై ఉగ్రదాడి!- భద్రతా సిబ్బందికి గాయాలు - Manipur CM Convoy Attack

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 1:18 PM IST

Updated : Jun 10, 2024, 3:07 PM IST

Manipur CM Convoy Attack : మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్​ బిరేన్​ సింగ్​ కాన్వాయ్​పై సోమవారం మెరుపు దాడి జరిగింది. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాంగ్​పోక్పి జిల్లాలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Manipur CM Convoy Attack
Manipur CM Convoy Attack (ANI)

Manipur CM Convoy Attack : మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్​ బిరేన్​ సింగ్​ ముందస్తు భద్రతా కాన్వాయ్​పై సోమవారం మెరుపు దాడి జరిగింది. భద్రతా కాన్వాయ్​ వాహనాలపై పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బందికి బుల్లెట్​ గాయాలు అయినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ముందస్తు కాన్వాయ్​ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాంగ్​పోక్పి జిల్లాలో జరిగినట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది
జిరిబామ్​ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్​పోస్టులు, ఒక ఫారెస్ట్​ బీట్​ అధికారి కార్యాలయం, దాదాపు 70 ఇళ్లను శనివారం దుండగులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం దిల్లీ నుంచి ఇంఫాల్​కు బయలుదేరిన సీఎం బిరేన్ సింగ్, జిరిబామ్​ను సందర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిరిబామ్​కు బయలుదేరిన సీఎం ముందస్తు కాన్వాయ్​పై సోమవారం ఉదయం 10:30 గంటలకు జాతీయ రహదారి-53 కోట్లెన్ గ్రామ సమీపంలో దాడి జరిగింది. మిలిటెంట్లు కాన్వాయ్​పై పలుమార్లు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు కూడా తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్​ కుడి భుజంపై బుల్లెట్ తగిలిందని, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి భద్రతా దళాలు చేరుకున్నాయి. ముష్కరులను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్​ ప్రారంభించాయి.

స్పందించిన సీఎం
ఈ దాడిని సీఎం బిరేన్ సింగ్ ఖండించారు. 'ముఖ్యమంత్రి కాన్వాయ్​పై దాడి జరగడం చాలా దురదృష్టకరం. సీఎంపై దాడి అంటే నేరుగా రాష్ట్ర ప్రజలపై జరిగినట్టే. ఈ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం' అని బిరేన్ సింగ్ స్పందించారు.

జిరిబామ్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచామని ఎస్పీ నమల్ మహత్తా తెలిపారు. 'ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బిందిని, ప్రత్యేక కమాండో బలగాలను మెహరించాం. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు గస్తీలో ఉన్నారు. ఇప్పటికే జిరబామ్ ప్రాంతం నుంచి దాదాపు 600 మంది అసోం వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఈ ప్రాంతంలో దాడులు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఎస్పీ తెలిపారు.

మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసు​లో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT

'రియాసీ' టెర్రర్​ అటాక్​ పాక్​ ఉగ్రసంస్థ పనే- మరిన్ని దాడులు చేస్తామంటూ! - Jammu Kashmir Terror Attack

Manipur CM Convoy Attack : మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్​ బిరేన్​ సింగ్​ ముందస్తు భద్రతా కాన్వాయ్​పై సోమవారం మెరుపు దాడి జరిగింది. భద్రతా కాన్వాయ్​ వాహనాలపై పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బందికి బుల్లెట్​ గాయాలు అయినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ముందస్తు కాన్వాయ్​ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాంగ్​పోక్పి జిల్లాలో జరిగినట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది
జిరిబామ్​ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్​పోస్టులు, ఒక ఫారెస్ట్​ బీట్​ అధికారి కార్యాలయం, దాదాపు 70 ఇళ్లను శనివారం దుండగులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం దిల్లీ నుంచి ఇంఫాల్​కు బయలుదేరిన సీఎం బిరేన్ సింగ్, జిరిబామ్​ను సందర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిరిబామ్​కు బయలుదేరిన సీఎం ముందస్తు కాన్వాయ్​పై సోమవారం ఉదయం 10:30 గంటలకు జాతీయ రహదారి-53 కోట్లెన్ గ్రామ సమీపంలో దాడి జరిగింది. మిలిటెంట్లు కాన్వాయ్​పై పలుమార్లు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు కూడా తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్​ కుడి భుజంపై బుల్లెట్ తగిలిందని, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి భద్రతా దళాలు చేరుకున్నాయి. ముష్కరులను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్​ ప్రారంభించాయి.

స్పందించిన సీఎం
ఈ దాడిని సీఎం బిరేన్ సింగ్ ఖండించారు. 'ముఖ్యమంత్రి కాన్వాయ్​పై దాడి జరగడం చాలా దురదృష్టకరం. సీఎంపై దాడి అంటే నేరుగా రాష్ట్ర ప్రజలపై జరిగినట్టే. ఈ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం' అని బిరేన్ సింగ్ స్పందించారు.

జిరిబామ్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచామని ఎస్పీ నమల్ మహత్తా తెలిపారు. 'ఈ ప్రాంతంలో భద్రతా సిబ్బిందిని, ప్రత్యేక కమాండో బలగాలను మెహరించాం. అన్ని సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు గస్తీలో ఉన్నారు. ఇప్పటికే జిరబామ్ ప్రాంతం నుంచి దాదాపు 600 మంది అసోం వెళ్లి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఈ ప్రాంతంలో దాడులు చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం' అని ఎస్పీ తెలిపారు.

మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసు​లో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT

'రియాసీ' టెర్రర్​ అటాక్​ పాక్​ ఉగ్రసంస్థ పనే- మరిన్ని దాడులు చేస్తామంటూ! - Jammu Kashmir Terror Attack

Last Updated : Jun 10, 2024, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.