ETV Bharat / bharat

ఝార్ఖండ్‌లో హోరాహోరీ- రెండు కూటముల బలాలు, బలహీనతలు ఇవే!

ఝర్ఖండ్​లో అసెంబ్లీ ఎన్నికలు- ఎన్డీఏ, ఇండియూ కూటముల బలాలు, బలహీనతలు ఇలా!

author img

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

Jharkhand Assembly Election 2024
Jharkhand Assembly Election 2024 (ETV Bharat)

Jharkhand NDA And INDIA Alliance : ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్‌ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది.

బీజేపీ ఎజెండా ఇదే!

  • బంగ్లాదేశీల చొరబాటు, అవినీతి అంశాలే ఎజెండాగా ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించారు.
  • మనీ లాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టునూ ఎన్డీఏ కూటమి ప్రస్తావిస్తోంది.
  • టికెట్ల ప్రకటనలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి జాబితాను అతి త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.
  • పొత్తులో భాగంగా ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) 9 నుంచి 11 స్థానాల్లో పోటీ చేయనుంది. నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు రెండు సీట్లను బీజేపీ ఇవ్వనుంది.

బలాలు

  • ప్రచారంలో నేతల దూకుడు
  • ఏజేఎస్‌యూతో పొత్తు
  • రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రచారం
  • గిరిజనుల్లో ప్రాబల్యమున్న చంపయీ సోరెన్‌ బీజేపీలో చేరడం.
  • శిబూ సోరెన్‌ కోడలు సీతా సోరెన్‌ పార్టీలోకి రావడం
  • గిరిజన నేత అర్జున్‌ ముండా పార్టీకి నాయకత్వం వహించడం.

బలహీనతలు

  • రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమని ప్రజలు భావించడం
  • హేమంత్‌ను అరెస్టు చేయడం, ఆయన భార్య రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం
  • మొత్తం 81 సీట్లలో 28 ఎస్టీలకు రిజర్వు కావడం. వాటిలో జేఎంఎం బలంగా ఉండటం

అధికార కూటమి ఇలా!
మరోవైపు, సంక్షేమ పథకాలను ఇండియా కూటమి నమ్ముకుంది. సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా జేఎంఎం ఆరోపిస్తోంది. ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని జేఎంఎం, కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించాయి.

బలాలు

  • హేమంత్‌ అరెస్టుతో గిరిజన సెంటిమెంటు బలపడటం
  • పలు సంక్షేమ పథకాల అమలు
  • సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానించి కేంద్రానికి లేఖ రాయడం.

బలహీనతలు

  • ప్రముఖ నేతలు ఎన్డీఏ కూటమిలో చేరడం.
  • ఇండియా కూటమిలో విభేదాలు

ఎన్నికల సంఘం మంగళవారం వెలువరించిన షెడ్యూలు ప్రకారం, నవంబరు 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఝార్ఖండ్​లో పోలింగ్‌ జరగనుంది. విజయంపై రెండు కూటములు కూడా ధీమాగా ఉన్నాయి.

Jharkhand NDA And INDIA Alliance : ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్‌ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది.

బీజేపీ ఎజెండా ఇదే!

  • బంగ్లాదేశీల చొరబాటు, అవినీతి అంశాలే ఎజెండాగా ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించారు.
  • మనీ లాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టునూ ఎన్డీఏ కూటమి ప్రస్తావిస్తోంది.
  • టికెట్ల ప్రకటనలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి జాబితాను అతి త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.
  • పొత్తులో భాగంగా ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) 9 నుంచి 11 స్థానాల్లో పోటీ చేయనుంది. నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు రెండు సీట్లను బీజేపీ ఇవ్వనుంది.

బలాలు

  • ప్రచారంలో నేతల దూకుడు
  • ఏజేఎస్‌యూతో పొత్తు
  • రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రచారం
  • గిరిజనుల్లో ప్రాబల్యమున్న చంపయీ సోరెన్‌ బీజేపీలో చేరడం.
  • శిబూ సోరెన్‌ కోడలు సీతా సోరెన్‌ పార్టీలోకి రావడం
  • గిరిజన నేత అర్జున్‌ ముండా పార్టీకి నాయకత్వం వహించడం.

బలహీనతలు

  • రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమని ప్రజలు భావించడం
  • హేమంత్‌ను అరెస్టు చేయడం, ఆయన భార్య రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం
  • మొత్తం 81 సీట్లలో 28 ఎస్టీలకు రిజర్వు కావడం. వాటిలో జేఎంఎం బలంగా ఉండటం

అధికార కూటమి ఇలా!
మరోవైపు, సంక్షేమ పథకాలను ఇండియా కూటమి నమ్ముకుంది. సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా జేఎంఎం ఆరోపిస్తోంది. ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని జేఎంఎం, కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించాయి.

బలాలు

  • హేమంత్‌ అరెస్టుతో గిరిజన సెంటిమెంటు బలపడటం
  • పలు సంక్షేమ పథకాల అమలు
  • సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానించి కేంద్రానికి లేఖ రాయడం.

బలహీనతలు

  • ప్రముఖ నేతలు ఎన్డీఏ కూటమిలో చేరడం.
  • ఇండియా కూటమిలో విభేదాలు

ఎన్నికల సంఘం మంగళవారం వెలువరించిన షెడ్యూలు ప్రకారం, నవంబరు 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఝార్ఖండ్​లో పోలింగ్‌ జరగనుంది. విజయంపై రెండు కూటములు కూడా ధీమాగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.