ETV Bharat / bharat

దేశంలో ఓపీ సేవలు బంద్​! నేషన్​వైడ్​ నిరసనకు IMA రెడీ- దిల్లీలో రెసిడెంట్​ డాక్టర్స్​ ఆందోళనలు - IMA Nationwide Protest

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 7:39 AM IST

Updated : Aug 16, 2024, 8:40 AM IST

IMA Nationwide Protest : బంగాల్​ జూనియర్​ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెడీ అయింది. అందులో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు, దేశ రాజధానిలోని రెసిడెంట్​ డాక్టర్ల సంఘాలు దిల్లీలో ఉమ్మడి ఆందోళనలకు సిద్ధమయ్యాయి.

IMA Nationwide Protest
IMA Nationwide Protest (ANI)

IMA Nationwide Protest : కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్​ఏ) సిద్ధమైంది. బుధవారం రాత్రి కోల్​కతాలోని ఆర్​జీ కర్​ మెడికల్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా, శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. కాగా, అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్​ఏ ఈ నిర్ణయం తీసుకుంది.

"కోల్​కతా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా(బుధవారం రాత్రి) విద్యార్థులు నిరసన చేపట్టారు. వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం(ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు మోడర్న్​ మెడిసిన్​ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నాం. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారు. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్​ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయి." అని ఐఎమ్​ఏ ఓ ప్రకటనలో వివరించింది.

దిల్లీలో వైద్యం బంద్!
మరోవైపు, దేశ రాజధానిలో నిరసనలు ఉద్ధృతం చేసేందుకు దిల్లీ రెసిడెంట్​ డాక్టర్స్​ అసోసియేషన్(ఆర్​డీఏ)​ రెడీ అయింది. ఈ మేరకు దిల్లీలోని AIIMS​, SJH, MAMC ఆస్పత్రుల ఆర్​డీఏల ప్రతినిధులు సమావేశం అయ్యారు. విస్తృత చర్చల తర్వాత, 2024 ఆగస్టు 16న దిల్లీవ్యాప్తంగా అన్ని ఆర్​డీఏలు న్యూదిల్లీలోని నిర్మాన్​ భవన్​ వద్ది ఉమ్మడిగా నిరసనలు కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయి.

అర్ధరాత్రి విధ్వంసం- 19మంది అరెస్ట్
మరోవైపు, బుధవారం రాత్రి ఆర్​జీ కర్​ ఆస్పత్రిలో విధ్వంసం సృష్టించిన ఘటనలో 19మందిని అరెస్ట్​ చేసినట్లు కోల్​కతా పోలీసులు తెలిపారు. అందులో ఐదుగురిని సోషల్​ మీడియా పోస్టుల ఫీడ్​బ్యాక్​ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

'సాక్ష్యాలను చెరిపివేయకుండా ఆపండి!'
ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి బంగాల్​ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాశారు. ఆర్​జీ కర్​ ఆస్పత్రి వద్ద సాక్ష్యాలను మరింత ధ్వంసం చేయకుండా నిరోధించడానికి సీఏపీఎఫ్​ సిబ్బందిని మోహరించాలని కోరారు.

IMA Nationwide Protest : కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్​ఏ) సిద్ధమైంది. బుధవారం రాత్రి కోల్​కతాలోని ఆర్​జీ కర్​ మెడికల్ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వ్యతిరేకంగా, శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా ఓపీ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. కాగా, అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు యథావిధిగా పనిచేస్తాయని వెల్లడించింది. రాష్ట్ర శాఖలతో సమావేశం అనంతరం ఐఎమ్​ఏ ఈ నిర్ణయం తీసుకుంది.

"కోల్​కతా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా(బుధవారం రాత్రి) విద్యార్థులు నిరసన చేపట్టారు. వారు నిరసన తెలిపిన ప్రాంగణంపై అల్లరి మూకలు దాడి చేశాయి. ఈ హేయమైన చర్యకు వ్యతిరేకంగా శనివారం(ఆగస్టు 17) ఉదయం 6 గంటల నుంచి ఆదివారం(ఆగస్టు 18) ఉదయం 6 గంటల వరకు మోడర్న్​ మెడిసిన్​ డాక్టర్ల సేవలు ఉపసంహరించుకుంటున్నాం. వైద్య వృత్తి స్వభావం కారణంగా వైద్యులు ముఖ్యంగా మహిళలు హింసకు గురవుతున్నారు. అలాంటి డాక్టర్లకు ఆస్పత్రులు, క్యాంపస్​ల్లో భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల అవసరాలను పర్యవేక్షించే అధికారుల ఉదాసీనత వల్లే వైద్యులపై భౌతిక దాడులు, నేరాలు జరుగుతున్నాయి." అని ఐఎమ్​ఏ ఓ ప్రకటనలో వివరించింది.

దిల్లీలో వైద్యం బంద్!
మరోవైపు, దేశ రాజధానిలో నిరసనలు ఉద్ధృతం చేసేందుకు దిల్లీ రెసిడెంట్​ డాక్టర్స్​ అసోసియేషన్(ఆర్​డీఏ)​ రెడీ అయింది. ఈ మేరకు దిల్లీలోని AIIMS​, SJH, MAMC ఆస్పత్రుల ఆర్​డీఏల ప్రతినిధులు సమావేశం అయ్యారు. విస్తృత చర్చల తర్వాత, 2024 ఆగస్టు 16న దిల్లీవ్యాప్తంగా అన్ని ఆర్​డీఏలు న్యూదిల్లీలోని నిర్మాన్​ భవన్​ వద్ది ఉమ్మడిగా నిరసనలు కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయి.

అర్ధరాత్రి విధ్వంసం- 19మంది అరెస్ట్
మరోవైపు, బుధవారం రాత్రి ఆర్​జీ కర్​ ఆస్పత్రిలో విధ్వంసం సృష్టించిన ఘటనలో 19మందిని అరెస్ట్​ చేసినట్లు కోల్​కతా పోలీసులు తెలిపారు. అందులో ఐదుగురిని సోషల్​ మీడియా పోస్టుల ఫీడ్​బ్యాక్​ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

'సాక్ష్యాలను చెరిపివేయకుండా ఆపండి!'
ఇదిలా ఉండగా, ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి బంగాల్​ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్​కు లేఖ రాశారు. ఆర్​జీ కర్​ ఆస్పత్రి వద్ద సాక్ష్యాలను మరింత ధ్వంసం చేయకుండా నిరోధించడానికి సీఏపీఎఫ్​ సిబ్బందిని మోహరించాలని కోరారు.

Last Updated : Aug 16, 2024, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.