ETV Bharat / bharat

రంగంలోకి NSG, NIA- రోబోలతో సెర్చ్​! దిల్లీ స్కూల్ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు

దిల్లీ రోహిణీలోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాల వెలుపల భారీ పేలుడు - తనిఖీలు నిర్వహిస్తున్న దర్యాప్తు బృందాలు

author img

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Updated : 7 hours ago

Delhi School Blast
Delhi School Blast (ETV Bharat)

Delhi School Blast : దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ పాఠశాల బాంబు పేలుడు కలకలం సృష్టించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్-ఎన్​ఎస్​జీ, నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్​ఐఏ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. మరిన్ని ఆధారాల కోసం స్నిఫర్‌ డాగ్స్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించడానికి రోబోలను మోహరించింది ఎన్​ఎస్​జీ. ఇప్పటికే పాఠశాలను తనిఖీ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఘటనాస్థలిలో లభించిన వైట్​ పౌడర్​ను ప్రయోగశాలకు పంపించారు.
మరోవైపు, పేలుడు సంభవించినప్పుడు పాఠశాల సమీపంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి మొబైల్ నెట్​వర్క్ డేటాను సేకరిస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది
రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ అనుమానాస్పద ఘటనలో పాఠశాల గోడ ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పాఠశాల సమీపంలో పార్క్ చేసిన కార్లు, చుట్టపక్కల ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. దుకాణాల సైన్ బోర్డులు దెబ్బతిన్నాయి. స్థానికులు పేలుడు దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేశారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని వారు తెలిపారు.

దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్‌ బృందాలు, క్రైమ్, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణులు పాఠశాల గోడ వద్ద తెల్లని పౌడర్‌ గుర్తించారు. దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. దానితో పాటు పాఠశాల సమీపంలోని మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్​కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా దాడికి పాల్పడ్డారా లేదా భూగర్భ మురుగునీటి లైన్‌లోని వాయువు- పేలుడుకు కారణమైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు దీల్లీ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేడులు నేపథ్యంలో దిల్లీలో పోలీసులు హై అలర్ట్​ ప్రకటించారు. పండుగ సీజన్​ కావడం వల్ల వివిధ మార్కెట్లల్లో పెట్రోలింగ్ చేయనున్నట్లు చెప్పారు.

'అండర్​ వరల్డ్ ముంబయిలా దిల్లీ'
ఈ ఘటనతో దిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని బహిర్గతం అయ్యిందని, అందుకు కారణం బీజేపీనే అని రాష్ట్ర సీఎం ఆతిశీ విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంప్రభుత్వంపై ఉందని కానీ, బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ' మా ప్రభుత్వం చేస్తోన్న పనులకు ఆటంకం కలిగించడానికి కేంద్రం తన సమయాన్ని వినియోగిస్తోంది. ఒకప్పటి అండర్‌ వరల్డ్‌ ముంబయిలా ప్రస్తుతం దిల్లీ పరిస్థితి మారింది. బహిరంగంగానే తూటాలు పేలుతున్నాయి, గ్యాంగ్​స్టార్స్​ డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించే సామర్థ్యం బీజేపీకి లేదు' అని ఎక్స్​ వేదికగా ఆతిశీ విమర్శించారు.

సీఎం ఆతీశీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆతిశీ తోలుబొమ్మ సీఎం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికింది.

Delhi School Blast : దిల్లీలోని సీఆర్​పీఎఫ్​ పాఠశాల బాంబు పేలుడు కలకలం సృష్టించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్-ఎన్​ఎస్​జీ, నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్​ఐఏ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. మరిన్ని ఆధారాల కోసం స్నిఫర్‌ డాగ్స్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించడానికి రోబోలను మోహరించింది ఎన్​ఎస్​జీ. ఇప్పటికే పాఠశాలను తనిఖీ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఘటనాస్థలిలో లభించిన వైట్​ పౌడర్​ను ప్రయోగశాలకు పంపించారు.
మరోవైపు, పేలుడు సంభవించినప్పుడు పాఠశాల సమీపంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి మొబైల్ నెట్​వర్క్ డేటాను సేకరిస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది
రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వెలుపల ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ అనుమానాస్పద ఘటనలో పాఠశాల గోడ ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పాఠశాల సమీపంలో పార్క్ చేసిన కార్లు, చుట్టపక్కల ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. దుకాణాల సైన్ బోర్డులు దెబ్బతిన్నాయి. స్థానికులు పేలుడు దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేశారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని వారు తెలిపారు.

దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్‌ బృందాలు, క్రైమ్, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణులు పాఠశాల గోడ వద్ద తెల్లని పౌడర్‌ గుర్తించారు. దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. దానితో పాటు పాఠశాల సమీపంలోని మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్​కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా దాడికి పాల్పడ్డారా లేదా భూగర్భ మురుగునీటి లైన్‌లోని వాయువు- పేలుడుకు కారణమైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు దీల్లీ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేడులు నేపథ్యంలో దిల్లీలో పోలీసులు హై అలర్ట్​ ప్రకటించారు. పండుగ సీజన్​ కావడం వల్ల వివిధ మార్కెట్లల్లో పెట్రోలింగ్ చేయనున్నట్లు చెప్పారు.

'అండర్​ వరల్డ్ ముంబయిలా దిల్లీ'
ఈ ఘటనతో దిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని బహిర్గతం అయ్యిందని, అందుకు కారణం బీజేపీనే అని రాష్ట్ర సీఎం ఆతిశీ విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంప్రభుత్వంపై ఉందని కానీ, బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ' మా ప్రభుత్వం చేస్తోన్న పనులకు ఆటంకం కలిగించడానికి కేంద్రం తన సమయాన్ని వినియోగిస్తోంది. ఒకప్పటి అండర్‌ వరల్డ్‌ ముంబయిలా ప్రస్తుతం దిల్లీ పరిస్థితి మారింది. బహిరంగంగానే తూటాలు పేలుతున్నాయి, గ్యాంగ్​స్టార్స్​ డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించే సామర్థ్యం బీజేపీకి లేదు' అని ఎక్స్​ వేదికగా ఆతిశీ విమర్శించారు.

సీఎం ఆతీశీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆతిశీ తోలుబొమ్మ సీఎం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికింది.

Last Updated : 7 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.