ETV Bharat / bharat

కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం- ఇద్దరు మృతి- శిథిలాల కిందే అనేక మంది - BUILDING COLLAPSE IN BURARI DELHI

దిల్లీలో కుప్పకూలిన కొత్తగా కట్టిన నాలుగు అంతస్తుల భవనం- ఇద్దరు మృతి- శిథిలాల కిందే అనేక మంది

Building Collapse In Burari Delhi
Building Collapse In Burari Delhi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2025, 9:12 AM IST

Updated : Jan 28, 2025, 9:36 AM IST

Building Collapse In Burari Delhi : దిల్లీలో కొత్తగా కట్టిన ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 8ఏళ్ల బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 12మందిని రక్షించినట్లు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. నగరంలోని బురాడీ ప్రాంతంలో ఉన్న భవనం కూలినట్లు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 22మంది భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎంఓ నీరజ్​ మీన, ఎంపీ మనోజ్ తివారీ, ఎమ్​ఎల్​ఏ సంజీవ్ ఝా ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

ఈ ప్రమాదం చాలా బాధాకరం అని దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఎక్స్​లో పోస్ట్ చేశారు. బాధితులకు అవసరం అయిన సాయం అందిచాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యకర్తలతో ఘటనాస్థలికి వెళ్లి అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే సంజీవ్ ఘాను ఆదేశించినట్లు ఆప్​ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్​ తెలిపారు.

'ఇది కచ్చితంగా నిర్లక్ష్యమే'
ఘటనాస్థలిని పరిశీలించిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అని అన్నారు. కొత్తగా కట్టిన భవనం కూలిపోవడం వెనుక కొందరి నిర్లక్ష్యం ఉందని, బాధ్యులను విడిచిపెట్టకూడదని డిమాండ్ చేశారు.

Building Collapse In Burari Delhi : దిల్లీలో కొత్తగా కట్టిన ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 8ఏళ్ల బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 12మందిని రక్షించినట్లు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. నగరంలోని బురాడీ ప్రాంతంలో ఉన్న భవనం కూలినట్లు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 22మంది భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎంఓ నీరజ్​ మీన, ఎంపీ మనోజ్ తివారీ, ఎమ్​ఎల్​ఏ సంజీవ్ ఝా ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

ఈ ప్రమాదం చాలా బాధాకరం అని దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఎక్స్​లో పోస్ట్ చేశారు. బాధితులకు అవసరం అయిన సాయం అందిచాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యకర్తలతో ఘటనాస్థలికి వెళ్లి అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే సంజీవ్ ఘాను ఆదేశించినట్లు ఆప్​ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్​ తెలిపారు.

'ఇది కచ్చితంగా నిర్లక్ష్యమే'
ఘటనాస్థలిని పరిశీలించిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అని అన్నారు. కొత్తగా కట్టిన భవనం కూలిపోవడం వెనుక కొందరి నిర్లక్ష్యం ఉందని, బాధ్యులను విడిచిపెట్టకూడదని డిమాండ్ చేశారు.

Last Updated : Jan 28, 2025, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.