ETV Bharat / bharat

'ఆదివారమే బిహార్​లో కొత్త సర్కారు- సీఎంగా మళ్లీ నీతీశ్'- అడ్డుకునేలా లాలూ స్కెచ్!

Bihar Political Crisis : బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్​డీఏలో చేరాలని జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆదివారమే బీజేపీ-జేడీయూ సర్కారు ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 10:35 AM IST

bihar government change
bihar government change

Bihar Political Crisis : జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఇండియా కూటమికి దూరంగా జరుగుతూ ఎన్​డీఏ వైపు చూస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బిహార్​లో రాజకీయం రక్తి కట్టింది. విపక్ష కూటమి ఏర్పాటులో క్రియాశీలంగా వ్యవహరించిన నీతీశ్- ఇప్పుడు దాన్నుంచి వేరుపడేందుకు యత్నిస్తుండటం చర్చనీయాంశమైంది. నీతీశ్ నిర్ణయంతో బిహార్​లో మహా కూటమి సర్కారు స్థానంలో మళ్లీ జేడీయూ- బీజేపీ ప్రభుత్వం ( Bihar Government Change ) కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అయితే, తిరిగి ఎన్​డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో జనవరి 28న (ఆదివారం) ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ కౌశలేంద్ర ప్రియదర్శి అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఇటీవలి పరిణామాలను గమనిస్తే నీతీశ్ కుమార్ ఇండియా కూటమిలో అసౌకర్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు రద్దు అవుతున్నాయి. ప్రధానమంత్రి కార్యక్రమాలు ఆర్​జేడీ, జేడీయూ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు కొనసాగదనేందుకు ఇదే నిదర్శనం. బిహార్​లో ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది."
-కౌశలేంద్ర ప్రియదర్శి, సీనియర్ జర్నలిస్ట్

పైచేయి నీతీశ్​దే
ప్రస్తుత పరిస్థితుల్లో నీతీశ్ కుమార్​కే మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రియదర్శి తెలిపారు. ఎమ్మెల్యేలను 'పోగు చేసుకొని' అసెంబ్లీలో బలనిరూపణకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నీతీశ్​దే పైచేయిలా కనిపిస్తోందని వివరించారు. ఎన్​డీఏతో నీతీశ్ కలిస్తే జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం చాలా తక్కువ అని పేర్కొన్నారు. జేడీయూ శాసనసభ్యులు ఆర్​జేడీలోకి వెళ్తారని అనుకోవడం లేదని అన్నారు. ప్రస్తుతం ఆర్​జేడీకి 79, బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఇతర చిన్న పార్టీలు బీజేపీతో కలిస్తే వారి బలం 128కి పెరుగుతుంది. ఆర్​జేడీ కూటమిలో 117 మంది మాత్రమే ఉంటారు. బిహార్​ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243 కాగా, మెజారిటీకి 122 మంది అవసరం.

"ఇండియా కూటమిలో అయోమయంపై నీతీశ్ కుమార్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. నీతీశ్ కుమార్​ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి బదులుగా కన్వీనర్​ పదవి అప్పగిస్తారని రెండు నెలలుగా ప్రచారం జరిగింది. చివరకు అది కూడా రాలేదు. దీంతో నీతీశ్​కు అక్కడ రాజకీయ భవిష్యత్ ఏమీ కనిపించలేదు. నీతీశ్ కుమార్​కు లోక్​సభలో సీట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఆయన సౌకర్యంగా లేరు."
-కౌశలేంద్ర ప్రియదర్శి, సీనియర్ జర్నలిస్ట్

బిహార్ రాజకీయాలు ఆదివారం కీలక మలుపు తీసుకుంటాయని ప్రియదర్శి అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మారుతుందని, మరో కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. అయితే నీతీశ్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పేరు కూడా ఖరారైందని వెల్లడించారు. జేడీయూ, బీజేపీల మధ్య చర్చలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్న ప్రియదర్శి- 24 గంటల్లో మార్పు పక్కా అని స్పష్టం చేశారు.

లాలూ స్కెచ్!
తాజా పరిణామాల నేపథ్యంలో జేడీయూ, ఆర్​జేడీ, బీజేపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల కోసం మీటింగ్​లు నిర్వహిస్తున్నాయి. అటు, లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తన ఎత్తులకు పదునుపెట్టారు. మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్​ను లాలూ పార్టీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​ సహా సీనియర్ పార్టీ నాయకులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆర్​జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారం నిలబెట్టుకోవాలని ఆర్​జేడీ భావిస్తున్నట్లు సమాచారం.

వెయిట్ అండ్ వాచ్​ మోడ్​లో కాంగ్రెస్- బిహార్​లో మళ్లీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు!

టీపార్టీకి దూరంగా తేజస్వి- తనకు తెలియదన్న నీతీశ్​- బిహార్​లో ఏం జరుగుతోంది?

Bihar Political Crisis : జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ఇండియా కూటమికి దూరంగా జరుగుతూ ఎన్​డీఏ వైపు చూస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బిహార్​లో రాజకీయం రక్తి కట్టింది. విపక్ష కూటమి ఏర్పాటులో క్రియాశీలంగా వ్యవహరించిన నీతీశ్- ఇప్పుడు దాన్నుంచి వేరుపడేందుకు యత్నిస్తుండటం చర్చనీయాంశమైంది. నీతీశ్ నిర్ణయంతో బిహార్​లో మహా కూటమి సర్కారు స్థానంలో మళ్లీ జేడీయూ- బీజేపీ ప్రభుత్వం ( Bihar Government Change ) కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అయితే, తిరిగి ఎన్​డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో జనవరి 28న (ఆదివారం) ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ కౌశలేంద్ర ప్రియదర్శి అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఇటీవలి పరిణామాలను గమనిస్తే నీతీశ్ కుమార్ ఇండియా కూటమిలో అసౌకర్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యక్రమాలు రద్దు అవుతున్నాయి. ప్రధానమంత్రి కార్యక్రమాలు ఆర్​జేడీ, జేడీయూ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు కొనసాగదనేందుకు ఇదే నిదర్శనం. బిహార్​లో ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది."
-కౌశలేంద్ర ప్రియదర్శి, సీనియర్ జర్నలిస్ట్

పైచేయి నీతీశ్​దే
ప్రస్తుత పరిస్థితుల్లో నీతీశ్ కుమార్​కే మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రియదర్శి తెలిపారు. ఎమ్మెల్యేలను 'పోగు చేసుకొని' అసెంబ్లీలో బలనిరూపణకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నీతీశ్​దే పైచేయిలా కనిపిస్తోందని వివరించారు. ఎన్​డీఏతో నీతీశ్ కలిస్తే జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం చాలా తక్కువ అని పేర్కొన్నారు. జేడీయూ శాసనసభ్యులు ఆర్​జేడీలోకి వెళ్తారని అనుకోవడం లేదని అన్నారు. ప్రస్తుతం ఆర్​జేడీకి 79, బీజేపీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఇతర చిన్న పార్టీలు బీజేపీతో కలిస్తే వారి బలం 128కి పెరుగుతుంది. ఆర్​జేడీ కూటమిలో 117 మంది మాత్రమే ఉంటారు. బిహార్​ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243 కాగా, మెజారిటీకి 122 మంది అవసరం.

"ఇండియా కూటమిలో అయోమయంపై నీతీశ్ కుమార్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. నీతీశ్ కుమార్​ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి బదులుగా కన్వీనర్​ పదవి అప్పగిస్తారని రెండు నెలలుగా ప్రచారం జరిగింది. చివరకు అది కూడా రాలేదు. దీంతో నీతీశ్​కు అక్కడ రాజకీయ భవిష్యత్ ఏమీ కనిపించలేదు. నీతీశ్ కుమార్​కు లోక్​సభలో సీట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా కూటమిలో ఆయన సౌకర్యంగా లేరు."
-కౌశలేంద్ర ప్రియదర్శి, సీనియర్ జర్నలిస్ట్

బిహార్ రాజకీయాలు ఆదివారం కీలక మలుపు తీసుకుంటాయని ప్రియదర్శి అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మారుతుందని, మరో కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. అయితే నీతీశ్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఉప ముఖ్యమంత్రి విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పేరు కూడా ఖరారైందని వెల్లడించారు. జేడీయూ, బీజేపీల మధ్య చర్చలు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్న ప్రియదర్శి- 24 గంటల్లో మార్పు పక్కా అని స్పష్టం చేశారు.

లాలూ స్కెచ్!
తాజా పరిణామాల నేపథ్యంలో జేడీయూ, ఆర్​జేడీ, బీజేపీలు పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చల కోసం మీటింగ్​లు నిర్వహిస్తున్నాయి. అటు, లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తన ఎత్తులకు పదునుపెట్టారు. మెజారిటీ లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్​ను లాలూ పార్టీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​ సహా సీనియర్ పార్టీ నాయకులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆర్​జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలను కలుపుకొని అధికారం నిలబెట్టుకోవాలని ఆర్​జేడీ భావిస్తున్నట్లు సమాచారం.

వెయిట్ అండ్ వాచ్​ మోడ్​లో కాంగ్రెస్- బిహార్​లో మళ్లీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు!

టీపార్టీకి దూరంగా తేజస్వి- తనకు తెలియదన్న నీతీశ్​- బిహార్​లో ఏం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.