ETV Bharat / bharat

అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో 'ఇండియా' హవా- ఎన్​డీఏకు తప్పని నిరాశ - Assembly Bypoll results

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 3:37 PM IST

Assembly Bypoll Results 2024 : దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. 10 స్థానాలు కైవసం చేసుకుని జయకేతనం ఎగురవేసింది. మరోవైపు, ఎన్​డీఏ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.

Assembly Bypoll Results 2024
Assembly Bypoll Results 2024 (ANI)

Assembly Bypoll Results 2024: దేశవ్యాప్తంగా 7రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

ఫలితాలు

  • బంగాల్​ ఉప ఎన్నికల్లో తృణమాలు కాంగ్రెస్ విజయం సాధించింది. మానిక్‌తలా, బాగ్దా, రాణాఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌గంజ్‌ మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్​ స్థానంలో కాంగ్రెస్ నేత హర్​దీప్ సింగ్ బవా 8వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక హమీర్​పుర్​ అసెంబ్లీ స్థానంలో బీజేపీ నేత ఆశీష్ శర్మ, తన ప్రత్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థిపై గెలుపొందారు.
  • పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో బీజేపీ అభ్యర్థి కమలేశ్ షా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షాపై 3వేల ఓట్లతో గెలుపొందారు.
  • ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, మంగలౌర్‌ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియుర్‌ శివ ముందంజలో ఉన్నారు.
  • బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ జయకేతనం ఎగురవేశారు.

బంగాల్​లో 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో మూడుచోట్ల ఎన్​డీఏ ప్రభుత్వం ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావటం వల్ల ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.

'మా కుమారుడి 'కీర్తి చక్రాన్ని' కనీసం తాకనివ్వలేదు'- కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు - Anshuman Parents Comments

'ఆమె' కళ్లపై 3000పైగా రికార్డులు- ప్రఖ్యాత కవుల కవితలు- అలాంటి వారు ప్రపంచంలో 10మందే! - Magical Eye Girl Of Kutch Gujarat

Assembly Bypoll Results 2024: దేశవ్యాప్తంగా 7రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. విపక్ష కూటమి 10 చోట్ల విజయం సాధించింది. బీజేపీ రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

ఫలితాలు

  • బంగాల్​ ఉప ఎన్నికల్లో తృణమాలు కాంగ్రెస్ విజయం సాధించింది. మానిక్‌తలా, బాగ్దా, రాణాఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌గంజ్‌ మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్​ స్థానంలో కాంగ్రెస్ నేత హర్​దీప్ సింగ్ బవా 8వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక హమీర్​పుర్​ అసెంబ్లీ స్థానంలో బీజేపీ నేత ఆశీష్ శర్మ, తన ప్రత్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థిపై గెలుపొందారు.
  • పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో బీజేపీ అభ్యర్థి కమలేశ్ షా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షాపై 3వేల ఓట్లతో గెలుపొందారు.
  • ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, మంగలౌర్‌ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.
  • తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియుర్‌ శివ ముందంజలో ఉన్నారు.
  • బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ జయకేతనం ఎగురవేశారు.

బంగాల్​లో 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా మరో మూడుచోట్ల ఎన్​డీఏ ప్రభుత్వం ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావటం వల్ల ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.

'మా కుమారుడి 'కీర్తి చక్రాన్ని' కనీసం తాకనివ్వలేదు'- కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు - Anshuman Parents Comments

'ఆమె' కళ్లపై 3000పైగా రికార్డులు- ప్రఖ్యాత కవుల కవితలు- అలాంటి వారు ప్రపంచంలో 10మందే! - Magical Eye Girl Of Kutch Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.