ETV Bharat / bharat

ఈ తాళం ఉంటే మీ ఇల్లు సేఫ్​! టచ్ చేస్తే మొబైల్​కు అలర్ట్స్​- దొంగల ఫొటోలు తీస్తుందట - Army Man Digital Lock

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 11:23 AM IST

Army Man Digital Lock : ప్రస్తుత కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్దపెద్ద తాళాలను పగలగొట్టి సొత్తును దోచుకెళ్లిపోతున్నారు దొంగలు. అందుకే దొంగతనాలకు అరికట్టేందుకు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మాజీ సైనికుడు డిజిటల్ లాక్​ను తయారు చేశారు. ఆ లాక్​ను దొంగలు టచ్ చేయగానే మీ ఫోన్​కు అలర్ట్ కాల్ వస్తుంది. అలాగే సైరన్ కూడా మోగుతుంది. ఇంకా ఈ డిజిటల్ లాక్​లో ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Army Man Digital Lock
Army Man Digital Lock (ETV Bharat)

Army Man Creates Digital Lock : తరచుగా జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు నడుం బిగించారు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మాజీ సైనికుడు. నెల రోజులపాటు శ్రమించి రూ.3 వేల ఖర్చుతో ఓ డిజిటల్ లాక్​ను తయారు చేశారు. ఈ లాక్ ఇల్లు, ఆఫీసు, దుకాణం దేన్నైనా దొంగల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టచ్ చేస్తే అలర్ట్ కాల్
సాగర్ జిల్లాలోని సిద్ధ్ గువాన్ ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన మాజీ సైనికుడు ముకేశ్ కుమార్ ఈ డిజిటల్ లాక్​ను రూపొందించారు. ఈ తాళాన్ని దొంగలు పగలగొట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సైరన్ మోగుతుంది. అంతేకాకుండా డివైజ్​కు కనెక్ట్ అయిన మొబైల్​కు అలర్ట్ కాల్ కూడా వెళ్తుంది. ఈ డిజిటల్ లాక్​కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఫొటో, వీడియో కూడా రికార్డవుతుంది. రూ.3 వేల బడ్జెట్​లోనే అందరికి ఉపయోగకరమైన ఈ డిజిటల్ లాక్ తయారు చేసిన ముకేశ్ కుమార్​పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

"నేను ఐటీఐలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ చదివాను. గత కొద్ది రోజులుగా మా ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. పోలీసులు నేరాలను అరికట్టలేకపోతున్నారు. అలాగే దొంగతనానికి పాల్పడినవారిని పట్టుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే ఈ డిజిటల్ లాక్ తయారు చేశాను. దాన్ని తాకినప్పుడు సైరన్ మోగుతుంది. అలాగే ఆ లాక్​కు కనెక్ట్​ ఉన్న మొబైల్​ నెంబర్​కు అలర్ట్ కాల్ వెళ్తుంది. అంతేకాకుండా డిజిటల్ లాక్​ను పగలగొట్టడానికి ప్రయత్నించే వారి ఫొటోతో పాటు, వీడియోను రికార్డు చేసేలా ఈ పరికరాన్ని రూపొందించాను." అని మాజీ సైనికుడు ముకేశ్ కుమార్ తెలిపారు.

సెన్సార్​తో డిజిటల్ లాక్
మాజీ సైనికుడు ముకేశ్​ కుమార్ ఈ డిజిటల్​ లాక్​ను తయారు చేసేందుకు సెన్సార్ కెమెరా, మొబైల్ పరికరాలు, అలాగే ఓ సైరన్​​ను ఉపయోగించారు. ఓ మందపాటి స్టీల్ తాళాన్ని ఉపయోగించి మరీ ఈ డిజిటల్ లాక్​ను రూపొందించారు. ఇందులో సెన్సార్ కెమెరాతో పాటు ఓ మొబైల్ పరికరం ఉంటుంది. సుమారు ఒక నెల వ్యవధిలోనే ఈ డిజిటల్ లాక్​ను తయారు చేశారు ముకేశ్ కుమార్. దీని బరువు దాదాపు రెండు కిలోలు. దీన్ని ఆన్​లో ఉంచాలంటే వైఫై కనెక్షన్ అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్- రక్తంతో పని లేదు!

ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!

Army Man Creates Digital Lock : తరచుగా జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు నడుం బిగించారు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మాజీ సైనికుడు. నెల రోజులపాటు శ్రమించి రూ.3 వేల ఖర్చుతో ఓ డిజిటల్ లాక్​ను తయారు చేశారు. ఈ లాక్ ఇల్లు, ఆఫీసు, దుకాణం దేన్నైనా దొంగల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టచ్ చేస్తే అలర్ట్ కాల్
సాగర్ జిల్లాలోని సిద్ధ్ గువాన్ ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన మాజీ సైనికుడు ముకేశ్ కుమార్ ఈ డిజిటల్ లాక్​ను రూపొందించారు. ఈ తాళాన్ని దొంగలు పగలగొట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సైరన్ మోగుతుంది. అంతేకాకుండా డివైజ్​కు కనెక్ట్ అయిన మొబైల్​కు అలర్ట్ కాల్ కూడా వెళ్తుంది. ఈ డిజిటల్ లాక్​కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇందులో తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఫొటో, వీడియో కూడా రికార్డవుతుంది. రూ.3 వేల బడ్జెట్​లోనే అందరికి ఉపయోగకరమైన ఈ డిజిటల్ లాక్ తయారు చేసిన ముకేశ్ కుమార్​పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

"నేను ఐటీఐలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ చదివాను. గత కొద్ది రోజులుగా మా ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. పోలీసులు నేరాలను అరికట్టలేకపోతున్నారు. అలాగే దొంగతనానికి పాల్పడినవారిని పట్టుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే ఈ డిజిటల్ లాక్ తయారు చేశాను. దాన్ని తాకినప్పుడు సైరన్ మోగుతుంది. అలాగే ఆ లాక్​కు కనెక్ట్​ ఉన్న మొబైల్​ నెంబర్​కు అలర్ట్ కాల్ వెళ్తుంది. అంతేకాకుండా డిజిటల్ లాక్​ను పగలగొట్టడానికి ప్రయత్నించే వారి ఫొటోతో పాటు, వీడియోను రికార్డు చేసేలా ఈ పరికరాన్ని రూపొందించాను." అని మాజీ సైనికుడు ముకేశ్ కుమార్ తెలిపారు.

సెన్సార్​తో డిజిటల్ లాక్
మాజీ సైనికుడు ముకేశ్​ కుమార్ ఈ డిజిటల్​ లాక్​ను తయారు చేసేందుకు సెన్సార్ కెమెరా, మొబైల్ పరికరాలు, అలాగే ఓ సైరన్​​ను ఉపయోగించారు. ఓ మందపాటి స్టీల్ తాళాన్ని ఉపయోగించి మరీ ఈ డిజిటల్ లాక్​ను రూపొందించారు. ఇందులో సెన్సార్ కెమెరాతో పాటు ఓ మొబైల్ పరికరం ఉంటుంది. సుమారు ఒక నెల వ్యవధిలోనే ఈ డిజిటల్ లాక్​ను తయారు చేశారు ముకేశ్ కుమార్. దీని బరువు దాదాపు రెండు కిలోలు. దీన్ని ఆన్​లో ఉంచాలంటే వైఫై కనెక్షన్ అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్- రక్తంతో పని లేదు!

ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.