గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో తెదేపా నాయకుడు షేక్ గౌస్పై దాడి జరిగింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నికి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయిత్ లేఖ రాశారు.
'తెదేపా శ్రేణులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టండి'
మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా శ్రేణులపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు గ్రామీణ ఎస్పీకి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండీ హిదాయిత్ లేఖ రాశారు. దాడులకు పాల్పడిన వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు.
!['తెదేపా శ్రేణులపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టండి' గుంటూరు గ్రామీణ ఎస్పీకి ముస్లిం మైనారిటీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7756114-75-7756114-1593016431939.jpg)
గుంటూరు గ్రామీణ ఎస్పీకి ముస్లిం మైనారిటీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ లేఖ
మాచవరం ఎస్ఐ కేసులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలీసులే స్వయంగా తెదేపా వారిని గ్రామం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు. మాచవరం ఎస్ఐ వైకాపా కార్యకర్తలా పని చేస్తున్నారని... ఎస్ఐతో పాటు, దాడులకు పాల్పడిన వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.