Minister Nara Lokesh Fires on YS Jagan: వైఎస్సార్సీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేదలకు మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని విమర్శించారు. దోపిడీకి హద్దులేదా జగన్, ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా అని లోకేశ్ ధ్వజమెత్తారు.
జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ల కోసం 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని లోకేశ్ పేర్కొన్నారు.
Lokesh on Alluri Sitarama Raju Birth Anniversary: స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి అర్పించారు. అల్లూరి సీతారామరాజు తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అని పిలుపునిచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.
Lokesh on Pingali Venkayya Death Anniversary: మువ్వన్నెల జాతీయ పతాకం రూపకర్త, తెలుగుజాతి కీర్తి పతాకం పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. మన గుండెల నిండా ఉన్న జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారు కావడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.