ETV Bharat / state

'కమీషన్లకు కక్కుర్తి పడి కాకినాడ పోర్టు భూములు తాకట్టు- 331 ఎకరాల కుంభకోణంలో ద్వారంపూడి' - MLA Kondababu on Dwarampudi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 7:53 PM IST

MLA Kondababu Comments on Dwarampudi: కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ద్వారంపూడి వైఖరితో పోర్టు ప్రమాదంలో పడిందన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి పోర్టు భూములు తాకట్టు పెట్టినా ద్వారంపూడి అడ్డుకోలేదని మండిపడ్డారు. పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు.

MLA Kondababu comments on Dwarampudi
MLA Kondababu comments on Dwarampudi (ETV Bharat)

MLA Kondababu Comments on Dwarampudi: ద్వారంపూడి వైఖరితో కాకినాడ పోర్టు ప్రమాదంలో పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ పోర్టు భూములు 331 ఎకరాలు తాకట్టు పెట్టారని, పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. ఆక్రమించిన పోర్టు భూములు వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లు రూపాయలు దోచుకున్నారని కొండబాబు తెలిపారు. ద్వారంపూడి అనుచరుడు ఆలీషా ఆరు వేల చదరపు గజాలు ్వేర్ యార్డ్ భూములు ఆక్రమించారన్నారు. పోర్టు అధికారులు నోటీసులు ఇచ్చినా ద్వారంపూడి అండదండలతో పట్టించుకోలేదన్నారు. కాకినాడ పోర్టులో పన్నులు వసూలు చేస్తున్నా, లాంచిలకు, పోర్టు కార్మికులకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు.

కాకినాడ పోర్టు నుంచి ద్వారంపూడి పీడీఎస్ రైస్ విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. ద్వారంపూడి వైఖరి కారణంగా కాకినాడ పోర్టు ప్రమాదంలో పడిందన్న కొండబాబు, రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులకు ద్వారంపూడి కారణంగా కేసుల ప్రమాదం పొంచి ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు భూములు 331 ఎకరాలను తాకట్టు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం కాకినాడ పోర్టు భూములను తాకట్టుపెట్టినా కమిషన్ల కోసం ద్వారంపూడి అడ్డుకోలేదన్నారు. కాకినాడ పోర్టు అక్రమాలపై న్యాయవిచారణ చేయాలని, ఆక్రమించిన పోర్టు భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని పోర్టు అధికారులను ఎమ్మెల్యే కొండబాబు ఆదేశించారు.

కాకినాడను గంజాయి రహితంగా మార్చుతాం - డంపింగ్‌యార్డు రోడ్డుని తెరిపించిన ఎమ్మెల్యే కొండబాబు - opened Kakinada dumping yard route

MLA Kondababu Comments on Dwarampudi: ద్వారంపూడి వైఖరితో కాకినాడ పోర్టు ప్రమాదంలో పడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ పోర్టు భూములు 331 ఎకరాలు తాకట్టు పెట్టారని, పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. ఆక్రమించిన పోర్టు భూములు వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

కాకినాడ పోర్టులో గత ఐదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లు రూపాయలు దోచుకున్నారని కొండబాబు తెలిపారు. ద్వారంపూడి అనుచరుడు ఆలీషా ఆరు వేల చదరపు గజాలు ్వేర్ యార్డ్ భూములు ఆక్రమించారన్నారు. పోర్టు అధికారులు నోటీసులు ఇచ్చినా ద్వారంపూడి అండదండలతో పట్టించుకోలేదన్నారు. కాకినాడ పోర్టులో పన్నులు వసూలు చేస్తున్నా, లాంచిలకు, పోర్టు కార్మికులకు ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు.

కాకినాడ పోర్టు నుంచి ద్వారంపూడి పీడీఎస్ రైస్ విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. ద్వారంపూడి వైఖరి కారణంగా కాకినాడ పోర్టు ప్రమాదంలో పడిందన్న కొండబాబు, రైస్ మిల్లర్లు, ఎగుమతిదారులకు ద్వారంపూడి కారణంగా కేసుల ప్రమాదం పొంచి ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు భూములు 331 ఎకరాలను తాకట్టు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ అవసరాల కోసం కాకినాడ పోర్టు భూములను తాకట్టుపెట్టినా కమిషన్ల కోసం ద్వారంపూడి అడ్డుకోలేదన్నారు. కాకినాడ పోర్టు అక్రమాలపై న్యాయవిచారణ చేయాలని, ఆక్రమించిన పోర్టు భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని పోర్టు అధికారులను ఎమ్మెల్యే కొండబాబు ఆదేశించారు.

కాకినాడను గంజాయి రహితంగా మార్చుతాం - డంపింగ్‌యార్డు రోడ్డుని తెరిపించిన ఎమ్మెల్యే కొండబాబు - opened Kakinada dumping yard route

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.