గుంటూరు జిల్లా అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాప్రసాద్ సమావేశమయ్యారు. కొవిడ్ మృతదేహాల తరలింపునకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో ఆ అంశంపై చర్చించారు. కొవిడ్ రోగుల మృతదేహాల తరలింపునకు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా కార్యాలయాల్లో మే 31 వరకు డ్రైవింగ్ టెస్టులు నిలిపేసినట్లు వెల్లడించారు.
అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాకుమార్ భేటీ
అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో రవాణా శాఖ అధికారులు సమావేశమయ్యారు. కొవిడ్తో చనిపోయిన వారిని తరలించేందుకు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వారితో చర్చించారు.
![అంబులెన్స్ డ్రైవర్లు, యజమానులతో డీటీసీ మీరాకుమార్ భేటీ dtc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11582722-545-11582722-1619706759215.jpg)
dtc
Last Updated : Apr 29, 2021, 10:19 PM IST