national

మెదక్​ జిల్లాలో విషాదం - డెంగ్యూ జ్వరంతో యువకుడు బలి

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 4:27 PM IST

Mortality due to seasonal diseases
Young Man Died of Dengue Fever (ETV Bharat)

Young Man Died of Dengue Fever at Medak : డెంగ్యూ ఫీవర్​తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలంలో చోటుచేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన యువకుడు నిఖిల్ (17) డెంగ్యూతో హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు మరణంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

వర్షాకాలంలో ముసురు వర్షాలు పడడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు నమోదవుతున్నాయి. చేగుంట మండలం జత్రం తండాలో ఒక ఇంట్లో ముగ్గురికి డెంగీ లక్షణాలు ఉండడంతో జిల్లా వైద్యాధికారి సందర్శించి తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రామయంపేట మండలం సుతారిపల్లి గ్రామస్తులు చికెన్ గున్యాతో హాస్పిటల్ పాలయ్యారు. జిల్లాలో అనేక గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details