ETV Bharat / state

జగన్​కు బై - పవన్​కు జై - జన సేనానితో బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ - Balineni meets Pawan Kalyan

author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Updated : 6 hours ago

Balineni Srinivasa Reddy Join Janasena : వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​తో భేటీ అయ్యారు. బుధవారం జగన్​ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం.

Balineni Srinivasa Reddy Join Janasena
Balineni Srinivasa Reddy Join Janasena (ETV Bharat)

Balineni Srinivasa Reddy meets Pawan Kalyan : వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​తో భేటీ అయ్యారు. బుధవారం జగన్​ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని, పవన్​ కల్యాణ్​తో సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన జనసేన గూటికి చేరే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైఎస్సార్​సీపీకి గుడ్​బై పలికారు. ఆయన కూడా జనసేనానితో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు.

'అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్​ కల్యాణ్​కు కృతజ్ఞతలు. త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్​ సమక్షంలో జనసేనలో చేరుతాను. పవన్​ ఆదేశాల మేరకు పనిచేస్తా. అందరినీ కలుపుకొని జనసేన అభివృద్ధికి కృషి చేస్తా. మాజీ సీఎం జగన్​ను బ్లాక్​మెయిల్​ చేసినట్లు కొన్ని యూట్యూబ్​ ఛానళ్లు రాశాయి. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్​సీపీని వీడలేదు. జగన్​ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నాను. సమావేశాల్లో జగన్​ ఎప్పుడూ నా గురించి మాట్లాడలేదు. నాతో పరిచయం లేకపోయినా పవన్​ నా గురించి మంచిగా మాట్లాడారు. నాకు పదవులు ముఖ్యం కాదు. గౌరవం కావాలి. స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నాను. పదవులు ఆశించలేదు. అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డా: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయభాను పవన్‌ను కలిశారు. ఈ క్రమంలో సామినేని మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్​సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. జగన్‌ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.

పరిణామాలు చూస్తే వైఎస్సార్​సీపీకి భవిష్యత్తు కనిపించట్లేదన్నారు. భవిష్యత్తు చూసుకోవాలనే తామంతా బయటకు వచ్చినట్లు ఉదయభాను తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కలిసి అన్ని‌ విషయాలు చర్చించినట్లు వివరించారు. ఈ నెల 22న తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాను తెలిపారు. వైఎస్​తో ఎంతో సన్నిహితంగా పని చేశానని అదే కమిట్​మెంట్​తో వైఎస్సార్​సీపీలో చేరినా జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు.

జగన్​కు మరో షాక్ - వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన బాలినేని - Balineni Srinivasa resign to YSRCP

కలవడానికి వస్తే అవమానిస్తారా - ఓడినా బుద్ధి మారలేదు : జగనన్నపై కార్యకర్తలు ఆగ్రహం - Clash at YS Jagan House

Balineni Srinivasa Reddy meets Pawan Kalyan : వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​తో భేటీ అయ్యారు. బుధవారం జగన్​ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని, పవన్​ కల్యాణ్​తో సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన జనసేన గూటికి చేరే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైఎస్సార్​సీపీకి గుడ్​బై పలికారు. ఆయన కూడా జనసేనానితో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​తో భేటీ అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు.

'అడిగిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అధినేత పవన్​ కల్యాణ్​కు కృతజ్ఞతలు. త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్​ సమక్షంలో జనసేనలో చేరుతాను. పవన్​ ఆదేశాల మేరకు పనిచేస్తా. అందరినీ కలుపుకొని జనసేన అభివృద్ధికి కృషి చేస్తా. మాజీ సీఎం జగన్​ను బ్లాక్​మెయిల్​ చేసినట్లు కొన్ని యూట్యూబ్​ ఛానళ్లు రాశాయి. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్సార్​సీపీని వీడలేదు. జగన్​ను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నాను. సమావేశాల్లో జగన్​ ఎప్పుడూ నా గురించి మాట్లాడలేదు. నాతో పరిచయం లేకపోయినా పవన్​ నా గురించి మంచిగా మాట్లాడారు. నాకు పదవులు ముఖ్యం కాదు. గౌరవం కావాలి. స్వచ్ఛందంగా జనసేనలో చేరుతున్నాను. పదవులు ఆశించలేదు. అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డా: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయభాను పవన్‌ను కలిశారు. ఈ క్రమంలో సామినేని మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్​సీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయనే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. మనసుకు కష్టం కలిగినందునే పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. జగన్‌ను అనేకసార్లు కలిసి పరిస్థితి చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.

పరిణామాలు చూస్తే వైఎస్సార్​సీపీకి భవిష్యత్తు కనిపించట్లేదన్నారు. భవిష్యత్తు చూసుకోవాలనే తామంతా బయటకు వచ్చినట్లు ఉదయభాను తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కలిసి అన్ని‌ విషయాలు చర్చించినట్లు వివరించారు. ఈ నెల 22న తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధమని సామినేని ఉదయభాను తెలిపారు. వైఎస్​తో ఎంతో సన్నిహితంగా పని చేశానని అదే కమిట్​మెంట్​తో వైఎస్సార్​సీపీలో చేరినా జగన్ వైఖరితో ఇబ్బందులు పడ్డానని వివరించారు.

జగన్​కు మరో షాక్ - వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన బాలినేని - Balineni Srinivasa resign to YSRCP

కలవడానికి వస్తే అవమానిస్తారా - ఓడినా బుద్ధి మారలేదు : జగనన్నపై కార్యకర్తలు ఆగ్రహం - Clash at YS Jagan House

Last Updated : 6 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.