national

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

ETV Bharat / snippets

తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు

FIRE TO THE STATUE OF TELANGANA THALLI
TELANGANA THALLI STATUE IN CHOUTAPALLI (ETV Bharat)

Fire to Telangana Thalli Statue : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు విగ్రహానికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఉదయం విగ్రహానికి నిప్పు పెట్టిన విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో విగ్రహాన్ని శుభ్రం చేయించారు. నిప్పు పెట్టిన దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహానిపై కోపం తీర్చుకోవాల్సిన అవసరం ఏముందని పోలీసులు కారణాలు ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి స్థానికుల వద్ద సమాచారం సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details