national

ఏక్‌ పేడ్‌ మా కే నామ్ - పార్టీ నగర కార్యాలయంలో మొక్క నాటిన కిషన్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 12:50 PM IST

kishan reddy planted sapling in name of his mother
Kishan Reddy planted saplings In Hyderabad (ETV Bharat)

Kishan Reddy planted saplings In Hyderabad: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మా కే నామ్ పిలుపు మేరకు బర్కత్​పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన మాతృమూర్తి పేరిట మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ అమ్మను గౌరవించుకోవాలని సూచించారు.

ఓవైపు అమ్మకు గౌరవం కల్పిస్తూనే మరోవైపు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ "ఏక్ పేడ్ మా కే నామ్" పేరిట మొక్కలు నాటే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే0. తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దిల్లీలో ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details