ETV Bharat / snippets

పిడుగు పాటుకు మహిళ మృతి - మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 12:19 PM IST

Woman Killed Due To Lightning
Woman Killed Due To Lightning (ETV Bharat)

Woman Killed Due To Lightning : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం దుబ్బపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. పంట చేనులో కలుపు తీస్తున్న నలుగురు మహిళలు పిడుగు పాటుకు గురయ్యారు. పంట చేనులో కలుపు తీస్తుడంగా, వర్షం పడటంతో అందరూ చెట్టు కిందకు వెళ్లడానికి ప్రయత్నించారు. అందులో సులోచన అనే మహిళ అందరి కంటే ముందుగా చెట్టు కిందకు చేరుకుంది.

అదే సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Woman Killed Due To Lightning : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం దుబ్బపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. పంట చేనులో కలుపు తీస్తున్న నలుగురు మహిళలు పిడుగు పాటుకు గురయ్యారు. పంట చేనులో కలుపు తీస్తుడంగా, వర్షం పడటంతో అందరూ చెట్టు కిందకు వెళ్లడానికి ప్రయత్నించారు. అందులో సులోచన అనే మహిళ అందరి కంటే ముందుగా చెట్టు కిందకు చేరుకుంది.

అదే సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.