national

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 1:40 PM IST

ETV Bharat / snippets

వనపర్తిలో రోడ్డు ప్రమాదం - గుజరాత్​కు చెందిన ముగ్గురు యాత్రికులు మృతి

Wanaparthy Lorry Accident
3 Killed in Accident At Wanaparthy (ETV Bharat)

3 Killed in Accident At Wanaparthy :పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న యాత్రికులను డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యాత్రికులు పాదయాత్ర చేస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. శనివారం రాత్రి జిల్లాలోని రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో బసచేసి తెల్లవారుజామున తిరిగి పాదయాత్ర పారంభించారు.

గ్రామం నుంచి వెళ్తున్న వీరిని హైదరాబాద్​ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరోవైపు ఖమ్మం పాలడుగులో ఏపీ చెందిన కారు ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు వేగంగా చెట్టుకు ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details