Three People Suicide Attempt in Hotel at Nagole :నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ హోటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే, నాగోల్కు చెందిన ఓ కుటుంబం ఐదు రోజులుగా తాజ్ త్రీ స్టార్ హోటల్లో ఉంటున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం - విషయం తెలిస్తే షాక్ తప్పదు?
Published : 8 hours ago
అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని కోడలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ భయంతో ఆ కుటుంబ సభ్యులు హానికర పదార్థం తీసుకొని హోటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారు ఉదయం లేచే సరికి అపస్మారక స్థితిలో ఉన్నట్లు హోటల్ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.