Published : 5 hours ago
అదుపుతప్పి బోల్తాపడిన టాటా ఏస్ వాహనం - ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
Accident In Suryapet Disrict :సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మాధవరం వద్ద టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రాంబాబు అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి గుంటూరుకు టాటా ఏస్ వ్యానులో తన ఇంటికి ఉపయోగపడే సామగ్రి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాంబాబుకు డివైడర్పై ఉన్న ఇనుప కడ్డీలు గుచ్చుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గాయాలైన వారిని స్థానికులు 108 వాహనం ద్వారా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేశారు.