Published : Sep 13, 2024, 4:51 PM IST
బస్సు వెళ్తుండగానే చెలరేగిన మంటలు- చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్
Fire in Running RTC Bus: సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ - కొమురవెల్లి మధ్యలో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపివేసి ప్రయాణికులను కిందికి దించేశాడు. కరీంనగర్ 1వ డిపోకు చెందిన రాజధాని ఆర్టీసీ బస్సు ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్లో మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును సైడ్కు నిలిపివేశాడు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపి మరో బస్సులో వాళ్లను గమ్యస్థానాలకు చేరవేశారు. బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో బస్సులోని అగ్నిమాపక పరికరంతో మంటలను నియంత్రించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.