national

ETV Bharat / snippets

తెలంగాణ నూతన సీఈవోగా సి.సుదర్శన్​ రెడ్డి నియామకం

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 7:02 PM IST

Sudharshan Reddy
Sudharshan as New Chief Electoral Officer of Telangana (ETV Bharat)

Sudharshan Reddy as New Chief Electoral Officer of Telangana : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సీఈవో పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను పంపించగా, 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని సీఈసీ ఎంపిక చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ప్రస్తుత సీఈవో వికాస్​రాజ్ రిలీవ్ అయ్యారు.

వికాస్​రాజ్​కు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. అదనపు సీఈవోలుగా చేసి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు లోకేశ్​ కుమార్​ను పంచాయతీ రాజ్ కార్యదర్శిగా, సర్ఫరాజ్ అహ్మద్​ను హెచ్ఎండీఏ కమిషనర్​గా ప్రభుత్వం ఇటీవలే కీలక బాధ్యతల్లో నియమించింది.

ABOUT THE AUTHOR

...view details