ప్రయాణికులకు గుడ్న్యూస్ - ఈ-గరుడ బస్సుల ఛార్జీలు తగ్గించిన టీజీఎస్ఆర్టీసీ
Published : Jul 24, 2024, 9:30 PM IST
|Updated : Jul 24, 2024, 9:44 PM IST
E-Garuda Bus Charges Reduction : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ-గరుడ బస్సు టిక్కెట్ ధరలను తగ్గిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ- గరుడ బస్సులను రాజధాని ఏసీ బస్ టికెట్ ధరలతో నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 30 నాటికి బుకింగ్ చేసిన ప్రయాణాలకు అమల్లో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని తక్కువ ధరలో అందించేందుకే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్.ఎం తెలిపారు.