Telangana Gurukul Teacher Aspirants Protest to CM Revanth House : గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ నుంచి పోలీసులు పంపించేయగా గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. గాంధీభవన్ ముట్టడికి వచ్చిన గురుకుల అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థులు ఆందోళన
Published : Jun 26, 2024, 6:46 PM IST
Telangana Gurukul Teacher Aspirants Protest to CM Revanth House (ETV Bharat)
ఈ సందర్భంగా గురుకుల అభ్యర్థులు బ్యాక్లాగ్ పోస్టుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ ఇంఛార్జి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావుకు వినతి పత్రం అందజేశారు.