IAS Officers Transfer in Telangana :రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి బదిలీ అయ్యారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ కమిషనర్గా శ్రీదేవిని బదిలీ చేసిన ప్రభుత్వం, వాణిజ్య పన్నుల కమిషనర్గా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి మార్క్ ఫెడ్ ఎండీగా బదిలీ అయ్యారు. ట్రాన్స్పోర్ట్, హౌజింగ్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ పోస్టును రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మార్చింది.
రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
Published : Aug 3, 2024, 6:39 PM IST
IAS Officers Transfer in Telangana (ETV Bharat)
విపత్తుల నిర్వహణ విభాగం జాయింట్ సెక్రటరీగా ఎస్.హరీశ్ను నియమించిన ప్రభుత్వం రవాణా, ఆర్అండ్బీ శాఖల అదనపు బాధ్యతలను కేటాయించింది. మార్కెటింగ్శాఖ డైరెక్టర్గా పీ.ఉదయ్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉపకార్యదర్శిగా సీహెచ్.ప్రియాంక నియమితులయ్యారు. హాకా మేనేజింగ్ డైరెక్టర్గా కె.చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.